వార్షిక పరీక్షలకు సిద్ధమయ్యే సమయాన ‘సాక్షి’ మెటీరియల్ బాసటగా నిలిచింది. ఉపాధ్యాయులు చెప్పే పాఠాలతో పాటు ఈ మెటీరియల్ ఆధారంగా సిద్ధమయ్యాను. తద్వారా పరీక్షల్లో 556 మార్కులు సాధించటం సాధ్యమైందని భావిస్తున్నా.
– సీహెచ్.తులసి,
పాతసెంటర్ హైస్కూల్, సత్తుపల్లి
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ‘సాక్షి’ ప్రోత్సాహం అందించింది. ఈ మెటీరియల్తో పాటు ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో నేను 551 మార్కులు సాధించగలిగాను. అలాగే, హెచ్ఎం, ఉపాధ్యాయులు ప్రత్యేక తరగతులు నిర్వహించారు.
– ఎం.జీవన్కుమార్,
కాకర్లపల్లి హైస్కూల్
‘సాక్షి’ ఆధ్వర్యాన రూపొందంచిన మోడల్ పేపర్ల సాయంతో ప్రాక్టీస్ చేయగా 556 మార్కులు సాధించడం ఆనందంగా ఉంది. ఉపాధ్యాయుల బోధనకు తోడు.. మంచి ఫలితాలు నమోదయ్యేలా సాక్షి యాజమాన్యం చేయూత మరువలేనిది.
– పొన్నడ హాసిని,
కేజీబీవీ, సింగరేణి


