
వన మహోత్సవానికి మొక్కలు సిద్ధం
చింతకాని: పచ్చదనాన్ని పెంపొందించేలా వచ్చేనెల 1నుంచి వన మహోత్సవం నిర్వహించనుండగా లక్ష్యం మేర నాటేందుకు మొక్కలు సిద్ధం చేయాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆదేశించారు. చింతకాని మండలం వందనంలోని నర్సరీని బుధవారం పరిశీలించిన ఆయన మాట్లాడారు. మొక్కలు నాటడంతో పాటు వంద శాతం సంరక్షించడం ద్వారా జిల్లాను రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలపాలని తెలిపారు. ప్రతీ శాఖకు కేటాయించిన లక్ష్యం మేర రెండు మీటర్ల కంటే ఎత్తు ఉన్న మొక్కలు నాటాలని, ప్రతీ మొక్కను జియోట్యాగ్ చేసి పర్యవేక్షించాలని చెప్పారు. అనంతరం కలెక్టర్ వందనంలోని స్వయంభూ శ్రీ రామలింగేశ్వరస్వామి ఆలయాన్ని సందర్శించి పూజలు చేశారు. డీఆర్డీఓ సన్యాసయ్య, ఎంపీడీఓ శ్రీనివాసరావు, ఐకేపీ ఏపీఎం శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.
చదువుతోనే ఉన్నత స్థానం
చదువుతోనే ఉన్నత స్థాయికి చేరొచ్చని, తద్వారా సమాజంలో గౌరవం లభిస్తుందని కలెక్టర్ అనుదీప్ తెలిపారు. వందనంలోని ప్రాథమిక పాఠశాలలను తనిఖీ చేసిన ఆయన పరిసరాలు, టాయిలెట్లు, వంటగదితో పాటు 1, 5వ తరగతుల్లో బోధనను పరిశీలించారు. తల్లిదండ్రులు ఆశలకు అనుగుణంగా కష్టపడి చదవాలని విద్యార్థులకు సూచించారు. జిల్లా విద్యాశాఖాధికారి సత్యనారాయణతో పాటు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
జిల్లాను రాష్ట్రంలోనే
ఆదర్శంగా నిలపాలి
కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
ఆస్పత్రుల్లో సేవలు మెరుగుపడాలి
ఖమ్మంవైద్యవిభాగం: ప్రభుత్వ ఆస్పత్రులపై నమ్మకంతో వచ్చే పేదలకు మెరుగైన వైద్యం అందించేలా వైద్యులు, సిబ్బంది కృషి
చేయాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
సూచించారు. వేతనాలు అందక ఆస్పత్రి కార్మికులు నిరవధిక సమ్మెకు దిగిన
నేపథ్యాన కలెక్టర్ బుధవారం ఆస్మత్రిని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వివిధ వార్డుల్లో చికిత్స పొందుతున్న వారితో మాట్లాడి వైద్యంపై ఆరా తీశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే కాక పరిసరాల పరిశుభ్రతపై దృష్టి సారించాని వైద్యులకు సూచించారు. ఫార్మసీలో అన్ని రకాల
మందులు అందుబాటులో ఉంచాలని, మెనూ ప్రకారం రుచి, శుచికరమైన ఆహారం అందించాలని తెలిపారు. అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ, ఆస్పత్రి సూపరింటెండెంట్ ఎల్.కిరణ్ కుమార్, డిప్యూటీ సూపరింటెండెంట్ బి.కిరణ్కుమార్, ఆర్ఎంఓ
రాంప్రసాద్, రాంబాబు పాల్గొన్నారు.

వన మహోత్సవానికి మొక్కలు సిద్ధం