
స్పోర్ట్ ్స స్కూళ్లలో ప్రవేశానికి పోటీలు
ఖమ్మంస్పోర్ట్స్: రాష్ట్రంలోని స్పోర్ట్స్ స్కూళ్లలో ప్రవేశాలు కల్పించేందుకు మండల స్థాయిలో పోటీలు నిర్వహించగా ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బుధవారం జిల్లా స్థాయి పోటీలు నిర్వహించారు. ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలో జరిగిన పోటీలకు 40 మంది బాలురు, 15 మంది బాలికలు హాజరయ్యారు. పరుగు పందెం, మెడిసిన్ బాల్ త్రో, స్టాండింగ్ బ్రాండ్ జంప్ తదితర అంశాల్లో పోటీలు నిర్వహించడమే కాక ఎత్తు, బరువు పరీక్షించారు. ఇందులో 10మంది చొప్పున బాలబాలికలను రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేశారు. జూలై 3వ తేదీన జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ కనబర్చిన వారికి స్పోర్ట్ స్కూళ్లలో ప్రవేశాలు కల్పిస్తారు. పోటీలను డీవైఎస్ఓ తుంబూరు సునీల్రెడ్డి పర్యవేక్షించగా మేనేజర్ ఉదయ్కుమార్, శాప్ పరిశీలకులు బి.రాంబాబు, కోచ్లు ఎం.డీ.గౌస్, పరిపూర్ణాచారి, చంద్రకాంత్, కై లాష్, నగేష్, సిరి పాల్గొన్నారు.