పరిశుభ్రమైన నగరమే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

పరిశుభ్రమైన నగరమే లక్ష్యం

Jun 26 2025 10:11 AM | Updated on Jun 26 2025 10:11 AM

పరిశు

పరిశుభ్రమైన నగరమే లక్ష్యం

● సిబ్బందికి ప్రజలు సహకరించాలి ● రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

ఖమ్మం అర్బన్‌: పరిశుభ్రత, తద్వారా ఆరోగ్యవంతమైన నగరంగా ఖమ్మంను తీర్చిదిద్దడంలో అందరూ సహకరించాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. ఖమ్మం 11వ డివిజన్‌ వరదయ్యనగర్‌లో బుధవారం నిర్వహించిన ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్‌లో పాల్గొన్న మంత్రి డ్రెయిన్‌లో మురుగు తొలగించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇరవై రోజుల నుంచి నగరంలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపడుతున్నందున ప్రజలు కూడా రోడ్ల వెంట, డ్రెయినేజీల్లో చెత్త వేయకుండా సిబ్బందికి సహకరించాలని తెలిపారు. నగరాన్ని శుభ్రంగా ఉంచుకోవడం ద్వారా ఆరోగ్యం సొంతమవుతుందని చెప్పారు. అనంతరం 4వ డివిజన్‌ రాజీవ్‌నగర్‌ గుట్టలో రూ.50 లక్షల టీయూఎఫ్‌ఐడీసీ నిధులతో నిర్మించే సీసీ రోడ్డు పనులకు మంత్రి శంకుస్థాపన చేసి మాట్లాడారు. పేదలు నివాసముంటున్న ప్రాంతాల్లో అన్ని సౌకర్యాలు కల్పించనున్నట్లు తెలిపారు. అనంతరం మేయర్‌ పునుకొల్లు నీరజ, కమిషనర్‌ అభిషేక్‌ అగస్త్య మాట్లాడగా వరదయ్య నగర్‌లో మంత్రి సహా అధికారులు మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్‌ రాయల నాగేశ్వరరావు, ఖమ్మం మార్కెట్‌ చైర్మన్‌ యరగర్ల హన్మంతరావు, డిప్యూటీ మేయర్‌ ఫాతిమా జోహరా, ఈఈలు వి.రంజిత్‌, కృష్ణలాల్‌, ఆర్డీఓ నర్సింహారావు, తహసీల్దార్‌ సైదులు, అటవీశాఖ అధికారి బెల్లం రాధిక, కార్పొరేటర్లు సరిపూడి రమాసతీష్‌, దండాజ్యోతిరెడ్డి, కమర్తపు మురళి, దుద్దుకూరి వెంకటేశ్వర్లు, చావా మాధురినారాయణరావు, సొసైటీ చైర్మన్‌ రావూరి సైదబాబుతో పాటు డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్‌, నాయకులు తాతా రఘురాం, కీసర పద్మజారెడ్డి, బోడా శ్రావణ్‌కుమార్‌, సాధు రమేష్‌రెడ్డి, ఏలూరి శ్రీనివాసరావు, పల్లెబోయిన చంద్రయ్య, లోడుగు వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.

రైతుల అభివృద్ధి కోసమే బ్యాంకు

వేంసూరు: పంటలతో పాటు ఇతర అవసరాలకు రుణాలు ఇస్తూ రైతులకు డీసీసీబీ ద్వారా సహకారం అందించాలని రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. వేంసూరు మండలం అడసర్లపాడు, కందుకూరు గ్రామాల్లో డీసీసీబీ బ్రాంచ్‌లను బుధవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. రైతు రుణమాఫీ చేయడమే కాక వరి నాట్లకు ముందే రైతుభరోసా నిధులు జమ చేసిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందని తెలిపారు. డీసీసీబీ చైర్మన్‌ దొండపాటి వెంకటేశ్వరరావు, ఆర్‌డీఓ రాజేంద్రగౌడ్‌, డీసీసీబీ డీజీఎంలు వేణుగోపాల్‌రావు, సర్వేశ్వరరావు, ఏజీఎం చందురావు, మేనేజర్లు నాగలక్ష్మి, రజిత, అలీమ్‌, నాయకులు వెల్ది జగన్‌మెహన్‌రావు, గొర్ల సంజీవరెడ్డి, ఎం.డీ.పైజుద్దీన్‌, బొమ్మనబోయిన వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

పరిశుభ్రమైన నగరమే లక్ష్యం1
1/1

పరిశుభ్రమైన నగరమే లక్ష్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement