
‘రాజీవ్ స్వగృహ’ సాధనకు కృషి
ఖమ్మం సహకారనగర్: జిల్లాలోని గెజిటెడ్ అధికారులకు ఇళ్ల స్థలాలకు బదులు రాజీవ్ స్వగృహ ఫ్లాట్స్ ఇప్పించేలా కృషి చేస్తామని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు అన్నారు. ఇందుకోసం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి సహకారం తీసుకుంటామని చెప్పారు. ఖమ్మంలోని టీజీఓ కార్యాలయంలో ఆదివారం జరిగిన సర్వసభ్య సమావేశంలో ఏలూరి మాట్లాడారు. ఫ్లాట్స్ కోసం ఇప్పటికే మంత్రులను కలిసి విన్నవించామని తెలిపారు. బ్యాంకు రుణ సదుపాయం కల్పించాలని, హైదరాబాద్ స్థాయిలో గేటెడ్ కమ్యూనిటీ తరహాలో ఖమ్మంలోని గెజిటెడ్ ఉద్యోగులకు సౌకర్యాలు కల్పించాలని కోరినట్లు చెప్పారు. సమావేశంలో హౌసింగ్ సొసైటీ అధ్యక్ష, కార్యదర్శులు కట్టా కిషోర్, పి.విజయ్కుమార్, టీజీఓ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కస్తాల సత్యనారాయణ, మోదుగు వేలాద్రి, టీజేఏసీ జిల్లా చైర్మన్ గుంటుపల్లి శ్రీనివాసరావు, కార్యదర్శి కొణిదన శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
టీజీఓ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరి