
మాజీ ఎమ్మెల్యేకు ప్రముఖుల నివాళి
రఘునాథపాలెం: బీఆర్ఎస్ వైరా నియోజకవర్గ ఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్యే బానోత్ మదన్లాల్ ఇటీవల గుండెపోటుతో మృతి చెందగా.. ఆదివారం ఆయన స్వగ్రామమైన రఘునాథపాలెం మండలంలోని ఈర్లపూడిలో దశదిన ఖర్మ నిర్వహించారు. ఈ సందర్భంగా వైరా నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు, మాజీ ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై మదన్లాల్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన కుమారుడు ఐఏఎస్ అధికారిగా ఉన్న బానోత్ మృగేంద్రలాల్ను పలువురు పరామర్శించారు. నివాళులర్పించిన వారిలో ఎమ్మెల్యేలు కోరం కనకయ్య, కూనంనేని సాంబశివరావుతోపాటు గుండాల కృష్ణ, కొండబాల కోటేశ్వరరావు, కూరాకుల నాగభూషణం, అజ్మీరా వీరూనాయక్ తదితరులు ఉన్నారు.