‘ఫిట్నెస్’ తూచ్..!
40 రోజుల్లో మూడు ప్రమాదాలు
పట్టించుకోని ఉన్నతాధికారులు
రుద్రంపూర్: కొత్తగూడెం ఏరియా పరిధిలోని వీకే–7 ఓసీలో నడుస్తున్న వోల్వోలు ఫిట్నెస్ లేని కారణంగా గడిచిన 40 రోజుల్లో మూడు ప్రమాదాలు జరిగాయి. క్వారీలో పనిచేసేఉద్యోగులు, ఇతరసిబ్బంది సెల్ఫోన్ లు వాడదరాలని, ఫలితంగా ప్రమాదాలు జరుగుతున్నాయని సంస్థ ఉన్నతాధికారులు కిందిస్థాయి అధికా రులు, ఉద్యోగులకు ఆదేశాలు జారీ చేసినా.. పట్టించుకోకపోవడంతో ప్రమాదాలకు నిలయంగా మారింది. అంతేకాక ఉద్యోగులకు సరైన శిక్షణ (ఎంవీటీసీ) కూ డా లేదని, దీనికి తోడు క్వారీలో పనిచేస్తున్న సిబ్బం ది నిర్లక్ష్యంతో ప్రమాదాలు జరుగుతున్నాయని కార్మికలువాపోతున్నారు. సంస్థలోపనిచేసేఉద్యోగులకు ఎం వీటీసీతో పాటు ఇతర అన్ని రకాలు శిక్షణలు ముగిసి న తరువాతే క్వారీలో పనుల్లోకి వెళ్లాల్సి ఉండగా.. వీకే–ఓసీలో మాత్రంఇందుకు విరుద్ధంగాజరుగుతున్నా.. ఉన్నతాధికారులు స్పందించకపోవడం గమనార్హం.
గతంలో ఎన్నడూ లేని ఒరవడి..
ఇదిలా ఉండగా, గతంలో ఇక్కడ ప్రాజెక్ట్ ఆఫీసర్గా పనిచేసే అధికారి ప్రతీ అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ఏ పనైనా జరిగేది. ఆయన ప్రతీ అంశాన్ని ప్రశ్నిస్తున్నారని చెప్పి ఇక్కడి నుంచి బదిలీ చేయించారని ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని నూతన ఒరవడి ఏరియాలో వినిపించడంతో కార్మికులను విస్మయానికి గురిచేస్తోంది.
వారోత్సవాలు జరిగిన మూడు రోజులకే..
ఏంటికి ఏమి కాకముందే ఇన్ని ప్రమాదాలు జరిగితే మరో 25 ఏళ్లు నడిచే ఓసీలో మరెన్ని ప్రమాదాలు సంభవిస్తాయోనని కార్మికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు రక్షణ వారోత్సవాలు జరిగిన మూడు రోజులకే ప్రమాదం జరగడం విస్మయానికి గురి చేస్తోంది. ఈ క్రమంలో సేఫ్టీ కమిటీ ఏ విచారణ చేశారో అర్థం కానీ అంశం. జరిగిన ప్రమాదం మరోమారు జరగకుండా చూడాల్సిన అధికారులే తప్పిదాన్ని కప్పిపుచ్చుకోవడంపై కార్మికుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికై నా కార్పొరేట్ సేఫ్టీ, ఏరియా ఉన్నతాధికారులు స్పందించి మరోమారు ప్రమాదాలు జరుగకుండా చర్యలు తీసుకోవాలని కార్మికులు కోరుతున్నారు.
వీకే–7 ఓసీలో
ఫిట్నెస్లేని వోల్వోలు


