
అర్హులకే ఇళ్లు ఇవ్వాలని ఆందోళన
కూసుమంచి: అర్హత కలిగిన పేదలకు మాత్రమే ఇందిరమ్మ గృహాలు మంజూరు చేయాలని కోరుతూ మండలంలోని గట్టుసింగారం గ్రామానికి చెందిన పలువురు శుక్రవారం ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో పలువురు గూడు లేని పేదలు ఉన్నా వారికి కాదని అనర్హులకు మంజూరు చేశారని ఆరోపించారు. ఈ విషయమై ఇటీవల గ్రామానికి వచ్చిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దృష్టికి తీసుకెళ్తే అర్హులకు న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారని తెలిపారు. అయినా పట్టించుకోకపోవడంతో ఆందోళనకు దిగినట్లు వెల్లడించారు.