అర్హులకే ఇళ్లు ఇవ్వాలని ఆందోళన | - | Sakshi
Sakshi News home page

అర్హులకే ఇళ్లు ఇవ్వాలని ఆందోళన

Jun 7 2025 12:14 AM | Updated on Jun 7 2025 12:14 AM

అర్హులకే ఇళ్లు ఇవ్వాలని ఆందోళన

అర్హులకే ఇళ్లు ఇవ్వాలని ఆందోళన

కూసుమంచి: అర్హత కలిగిన పేదలకు మాత్రమే ఇందిరమ్మ గృహాలు మంజూరు చేయాలని కోరుతూ మండలంలోని గట్టుసింగారం గ్రామానికి చెందిన పలువురు శుక్రవారం ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో పలువురు గూడు లేని పేదలు ఉన్నా వారికి కాదని అనర్హులకు మంజూరు చేశారని ఆరోపించారు. ఈ విషయమై ఇటీవల గ్రామానికి వచ్చిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దృష్టికి తీసుకెళ్తే అర్హులకు న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారని తెలిపారు. అయినా పట్టించుకోకపోవడంతో ఆందోళనకు దిగినట్లు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement