
విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
తిరుమలాయపాలెం: వైద్య సేవల్లో విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని డీసీహెచ్ఎస్ డాక్టర్ రాజశేఖర్గౌడ్ అన్నారు. గురువారం తిరుమలాయపాలెం కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో వైద్యులు, సిబ్బందితో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ప్రజలకు వైద్య సేవలు అందించడంలో ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, వైద్యులు సమయపాలన పాటించడంతో పాటు మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు. ఇక్కడ పని చేయడం ఇష్టం లేని వైద్యులు తమ వివరాలను తెలపాలని సూచించారు. జిల్లా కలెక్టర్తో పాటు ఇతర అధికారులు తిరుమలాయపాలెంపై ప్రత్యేక దృష్టి పెట్టారని, మెరుగైన వైద్యసేవలు అందించి మంచి పేరు తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైద్యులు అమర్సింగ్, బొల్లికొండ శ్రీనివాసరావు, ప్రతాపరెడ్డి, సురేష్ తదితరులు పాల్గొన్నారు.
టెన్నిస్ విజేతలకు బహుమతులు
ఖమ్మం స్పోర్ట్స్: ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలో నెల రోజులుగా జరుగుతున్న లాన్ టెన్నిస్ సమ్మర్ క్యాంప్ ముగింపు సందర్భంగా క్రీడాకారులకు పోటీలు నిర్వహించారు. ఇందులో విజేతలకు డీవైఎస్ఓ టి.సునీల్రెడ్డి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో టెన్నిస్ అసోసియేషన్ బాధ్యులు సత్యనారాయణ, కై లాస్ తదితరులు పాల్గొన్నారు.