
ముగిసిన వేసవి క్రీడా శిబిరాలు
ఖమ్మం స్పోర్ట్స్ : క్రీడా శిక్షణలు నిరంతరం కొనసాగేలా తల్లిదండ్రులు పిల్లలను ప్రోత్సహించాలని ఖమ్మం డీవైఎస్ఓ టి.సునీల్రెడ్డి, తహసీల్దార్ పుల్లయ్య అన్నారు. నగరంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో నెల రోజులుగా సాగుతున్న వేసవి క్రీడా శిక్షణా శిబిరాలు గురువారం ముగిశాయి. ఈ సందర్భంగా క్రీడాకారులకు సర్టిఫికెట్లు, బహుమతులు ప్రదానం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఖమ్మంలోనే క్రీడా మౌలిక సదుపాయాలు ఉన్నాయని, వీటిని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. స్టేడియంలో ప్రాక్టిస్ చేసిన క్రీడాకారులే అంతర్జాతీయ స్థాయిలో పాల్గొన్నారంటే ఎలాంటి క్రీడా సౌకర్యాలు, శిక్షకులు ఉన్నారో అర్థం చేసుకోవచ్చని చెప్పారు. కార్యక్రమంలో స్పోర్ట్స్ అథారిటీ శిక్షకులు ఎండీ.గౌస్, ఎండీ అక్బర్ అలీ, ఉదయ్కుమార్, క్రీడా సంఘాల ప్రతిధులు వీవీఎస్ మూర్తి, సురేష్, గోపికృష్ణ, శ్రీనివాసరావు, కొండల్, నగేష్ తదితరులు పాల్గొన్నారు.