విద్యార్థులకు పోషకాహారమే కీలకం | - | Sakshi
Sakshi News home page

విద్యార్థులకు పోషకాహారమే కీలకం

Jun 5 2025 8:20 AM | Updated on Jun 5 2025 8:20 AM

విద్యార్థులకు పోషకాహారమే కీలకం

విద్యార్థులకు పోషకాహారమే కీలకం

రఘునాథపాలెం: ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువుకునే విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం అందజేసే బాధ్యత వంట సిబ్బందిపై ఉందని కలెక్టర్‌ ముజమ్మిల్‌ ఖాన్‌ పేర్కొన్నారు. రఘునాథపాలెం మండలం కోయచలక క్రాస్‌ వద్ద గురుకులంలో సాంఘిక సంక్షేమ శాఖ, విద్యాశాఖ పరిధిలోని గురుకులాల వంట సిబ్బందికి బుధవారం ఇచ్చిన నైపుణ్య శిక్షణను కలెక్టర్‌ పరిశీలించారు. తొలుత అంబేద్కర్‌ చిత్రపటానికి నివాళులర్పించాక ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు ఆరోగ్యవంతమైన, రుచికరమైన ఆహారం అందించడంలో వంట సిబ్బంది కీలకంగా వ్యవహరించాలన్నారు. తల్లిప్రేమతో కూడిన భోజనం అందిస్తే విద్యార్థులు చదువుపై దృష్టి సారిస్తారని తెలిపారు. అనంతరం ఆహార తనిఖీలకు ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌కు కేటాయించిన వాహనాన్ని పరిశీలించిన కలెక్టర్‌, అందులోని యంత్రాల పనితీరుపై ఆరాతీశారు. అదనపు కలెక్టర్‌ డాక్టర్‌ పి.శ్రీజ, సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖల డీడీలు కస్తాల సత్యనారాయణ, ఎన్‌.విజయలక్ష్మి, ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ కిరణ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

రిటైర్ట్‌ ఉద్యోగులకు సన్మానం

ఖమ్మం సహకారనగర్‌: వివిధ ప్రభుత్వ శాఖల్లో విధులు నిర్వర్తించి ఇటీవల ఉద్యోగ విరమణ చేసిన అధికారులు, ఉద్యోగులను కలెక్టర్‌ ముజమ్మిల్‌ ఖాన్‌ సన్మానించారు. కలెక్టరేట్‌లో జరిగిన కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ డాక్టర్‌ పి.శ్రీజతో కలిసి వివిధ శాఖల అధికారులు జి.గురువయ్య, ఎం.మోహన్‌, జి.ఉమాదేవి, ఎన్‌.వసంత, వై.సరస్వతి, సీహెచ్‌.రాజకొమురమ్మ, టి.నాగేశ్వరరావు, వై.వీ.రమణ, జి.అప్పమ్మ, ఎం.డీ.రఫీ అహ్మద్‌ను సన్మానించి విధినిర్వహణ వివరాలు తెలుసుకున్నారు. అలాగే, సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ పీడీగా పనిచేస్తూ 2012 జూలైలో ఉద్యోగ విరమణ చేసిన బి.రమాదేవితో ‘ప్రస్థానం’ పేరిట మాట్లాడారు. అప్పట్లో జిల్లా పరిస్థితులు, ఉద్యోగ నిర్వహణలో ఎదురైన సవాళ్లు, వాటిని ఎలా అధిగమించారు, ఉద్యోగంలో సాధించిన ఘనతలు, ప్రభుత్వ పథకాలనుఅర్హులందరికీ చేర్చడంలో తీసుకున్న జాగ్రత్తలను ఆరా తీయడమే కాక విధినిర్వహణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రస్తుత ఉద్యోగులకు సూచనలు ఇప్పించారు. ఈకార్యక్రమంలో జిల్లా పరిషత్‌ సీఈఓ దీక్షారైనా, డీవైఎస్‌ఓ సునీల్‌రెడ్డి, బీసీ సంక్షేమ శాఖాధికారి జి.జ్యోతి, ఉద్యోగులు అరుణ, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

కలెక్టర్‌ ముజమ్మిల్‌ ఖాన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement