బెల్ట్‌షాపులు తొలగించాలని నిరసన | - | Sakshi
Sakshi News home page

బెల్ట్‌షాపులు తొలగించాలని నిరసన

Jun 3 2025 12:28 AM | Updated on Jun 3 2025 12:28 AM

బెల్ట

బెల్ట్‌షాపులు తొలగించాలని నిరసన

సత్తుపల్లిరూరల్‌: మద్యంతో కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నందున బెల్ట్‌షాప్‌లు తొలగించాలనే డిమాండ్‌తో వేంసూరు మండలం శంభునిగూడెంకు చెందిన మహిళలు పలువురు సోమవారం నిరసన తెలిపారు. ఈమేరకు సత్తుపల్లి ఎకై ్సజ్‌స్టేషన్‌ ఎదుట ఆందోళనకు దిగిన వారు మాట్లాడారు. ఎకై ్సజ్‌ అధికారులు స్పందించి గ్రామాల్లో బెల్ట్‌షాపులు తొలగించాలని డిమాండ్‌ చేస్తూ ఎస్సై శేఖర్‌కు వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో పద్మ, రాధ, మారేశ్వరమ్మ, చెన్నమ్మ, తిరుపతమ్మ, సావిత్రి, రమణ, కొలికపోగు సర్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

డీసీఎంఎస్‌ ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు

ఖమ్మంవ్యవసాయం: జిల్లా కో–ఆపరేటివ్‌ మార్కెటింగ్‌ సొసైటీ(డీసీఎంఎస్‌)లో ఉత్తమ సేవలందించిన ఉద్యోగులకు అదనపు కలెక్టర్‌, సంస్థ పర్సన్‌ ఇన్‌చార్జి పి.శ్రీనివాసరెడ్డి ప్రశంసా పత్రాలు అందించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఖమ్మంలోని డీసీఎంఎస్‌ కార్యాలయంలో ఆయన జాతీయ జెండాను ఎగురవేసి మాట్లాడారు. అనంతరం ఉత్తమ సేవలందించిన ఆఫీస్‌ సబార్డినేట్‌ వెలిశాల వెంకటి, కల్లూరు సూపర్‌వైజర్‌ పెరుగు నాగరాజు, నేలకొండపల్లి ఉద్యోగి బొడ్డు సంతోష్‌కు ప్రశంసాపత్రాలు అందించారు. సంస్థ మేనేజర్‌ కె.సందీప్‌, ఉద్యోగులు పి.వినోద్‌, గోపి, శివప్రసాద్‌రెడ్డి పాల్గొన్నారు.

వర్షానికి కూలిన

ఇంటి పైకప్పు

కారేపల్లి: ఇటీవల కురిసిన వర్షాలతో పూర్తిగా నానిన పెంకుటింటి కప్పు కుప్పకూలింది. మండలంలోని గేటుకారేపల్లికి చెందిన భూక్యా శాంతి బాలికల ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తోంది. ఆమె సోమవారం పక్కనే ఉన్న బంధువుల ఇంటికి వెళ్లగా, ఇప్పటికే వరుస వర్షాలతో నానిన ఇంటి కప్పు, గోడలు ఒక్కసారిగా కుప్పకూలాయి. ఆ సమయంలో శాంతి లేకపోవడంతో ప్రమాదం తప్పినట్లయింది. కాగా, అధికారులు తనకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని ఆమె కోరింది.

చికిత్స పొందుతున్న

వృద్ధురాలు మృతి

కారేపల్లి: పురుగుల మందు తాగిన వృద్ధురాలు చికిత్స పొందుతూ మృతి చెందింది. మండలంలోని స్టేషన్‌ చీమలపాడుకు చెందిన బానోతు మంగ్లీ(70) భర్త ఏడాది క్రితం మృతి చెందగా, అప్పుడప్పుడూ మద్యం తాగుతుండేది. ఈ క్రమంలోనే గత నెల 29న మద్యం తాగాక మంగ్లీ పురుగుల మందు తాగింది. కాసేపటికి గమనించిన కుటుంబీకులు ఖమ్మం తరలించి చికిత్స చేయిస్తుండగా సోమవారం మృతి చెందిందని ఎస్‌ఐ బి.గోపి తెలిపారు.

స్పృహ తప్పిన

ఏఆర్‌ కానిస్టేబుల్‌

ఖమ్మం సహకారనగర్‌: ఖమ్మం పరేడ్‌ గ్రౌండ్‌లో జరిగిన రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా విధుల్లో ఉన్న ఏఆర్‌ కానిస్టేబుల్‌ హుస్సేన్‌ పాషా స్పృహ తప్పి కిందపడ్డాడు. దీంతో సహచర సిబ్బంది 108 వాహనంలోకి ఎక్కించి ప్రాథమిక చికిత్స అందించారు. ఎండ తీవ్రంగా ఉండడంతో ఆయన స్పృహ కోల్పోగా, చికిత్స అనంతరం కోలుకున్నాడని అధికారులు తెలిపారు.

రుణ బాకీ పేరిట

వితంతువుల పింఛన్‌ నిలిపివేత

మధిర: వితంతు, ఒంటరి మహిళ పింఛన్లు అందుకుంటున్న మహిళలు సభ్యులుగా ఉన్న మహిళా సంఘం పేర బకాయి ఉందంటూ పది నెలలుగా తెలంగాణ గ్రామీణ బ్యాంకు మేనేజర్‌ పింఛన్లు నిలిపివేయడంపై ఆవేదన చెందుతున్నారు. మధిర మండలం దెందుకూరుకు చెందిన కొత్తపల్లి సుధ, పగిడిపల్లి కాంతమ్మ వితంతువుల పింఛన్‌, గద్దల పున్నమ్మ ఒంటరి మహిళ పింఛన్‌ తీసుకుంటున్నారు. అయితే, పది నెలలుగా దెందుకూరులోని తెలంగాణ గ్రామీణ వికాస బ్యాంక్‌ మేనేజర్‌ పింఛన్‌ ఆపేయడంతో ఇల్లు గడవక ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. తాము సభ్యులుగా ఉన్న డ్వాక్రా గ్రూపులో కొందరు రుణబకాయి చెల్లించకపోవడమే ఇందుకు కారణమంటూ మేనేజర్‌ చెప్పారని తెలిపారు. ఈవిషయమై బ్యాంక్‌ మేనేజర్‌ వెంకన్నను వివరణ కోరగా అంజలి డ్వాక్రా గ్రూపు తరఫున రుణం తీసుకోగా కొందరు సభ్యులు తిరిగి చెల్లించడం లేదన్నారు. గ్రూపు నిబంధనల ప్రకారం సభ్యులెవరు చెల్లించకున్నా అందరూ బాధ్యత తీసుకోవాల్సి ఉంటుందని, అందుకే వారి అకౌంట్‌ హోల్డ్‌లో పెట్టామని వెల్లడించారు.

బెల్ట్‌షాపులు  తొలగించాలని నిరసన
1
1/1

బెల్ట్‌షాపులు తొలగించాలని నిరసన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement