
సమగ్రాభివృద్ధే లక్ష్యం
మధిర: మధిర నియోజకవర్గాన్ని సమగ్రాభివృద్ధి చేయడమే లక్ష్యంగా కార్యాచరణ రూపొందించామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు. మధిర మండలం మాటూరులో రూ.2.60 కోట్ల వ్యయంతో నిర్మించనున్న 33/11 కేవీ సబ్ స్టేషన్ పనులకు సోమవారం ఆయన శంకుస్థాపన చేసి మాట్లాడారు. ఈ సబ్ ఏర్పాటుతో మాటూరు, మాటూరుపేట, నాగవరప్పాడు, సిద్ధినేనిగూడెం, అంబారుపేట గ్రామాలకు అంతరాయాలు లేని నాణ్యమైన విద్యుత్ సరఫరా జరుగుతుందని తెలిపారు. ఇదే కాక అవసరమైన చోట సబ్స్టేషన్ల నిర్మాణం, ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటు, రహదారుల నిర్మాణానికి నిధులు కేటాయిస్తున్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం ఎస్ఈ ఇనుగుర్తి శ్రీనివాసాచారి, డీఈలు బండి శ్రీనివాసరావు, కె.హీరాలాల్, ఏడీఈలు ఏ.కిరణ్ చక్రవర్తి, శ్రీనివాస్, ఎం.అనురాధ, ఈఈ జి.వెంకటేశ్వర్లు, ఏడీఈ మధిర రూరల్ ఏఈ ఎస్.మైథిలి పాల్గొన్నారు.
ఈ చెత్తాచెదారం ఏమిటి?
ఐబీ డీఈ నాగబ్రహ్మయ్యపై డిప్యూటీ సీఎం భట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. సబ్ స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన సందర్భంగా జాలిముడి ప్రాజెక్టును తనిఖీ చేశారు. అక్కడ మద్యం సీసాలు, చెత్తాచెదారం ఉండడాన్ని గమనించిన ఆయన నిర్వహణ కోసం నిధులు మంజూరు చేసినా నిర్లక్ష్యం చేయడం సరికాదని పేర్కొన్నారు.
రూ.25కోట్లతో రహదారి, సెంట్రల్ లైటింగ్
చింతకాని: చింతకానిలో పలు అభివృద్ధి పనులకు డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క శంకుస్థాపన చేశారు. రూ.25 కోట్ల నిధులతో చింతకాని నుంచి కొణిజర్ల వరకు డబుల్ లేన్ బీటీ రహదారి నిర్మాణంతో పాటు చింతకానిలో ప్రధాన రహదారిపై సెంట్రల్ లైటింగ్ నిర్మానం పనులకు శంకుస్థాపన చేయగా.. కాంగ్రెస్ నాయకులు, స్థానికులకు ఆయనకు స్వాగతం పలికారు. కాగా, చింతకానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం లేదని స్థానికులు చెప్పగా ఆర్టీసీ ఆర్ఎంతో ఫోన్లో మాట్లాడి ఆదేశాలు జారీచేశారు. అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి, ఇరిగేషన్ డీఈ రాంప్రసాద్, తహసీల్దార్ కూరపాటి అనంతరాజు, ఎంపీడీఓ శ్రీనివాసరావు, కాంగ్రెస్ జిల్లా, మండల అధ్యక్షులు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, అంబటి వెంకటేశ్వర్లు, నాయకులు మడుపల్లి భాస్కర్, కూరపాటి కిషోర్, కన్నెబోయిన గోపి, బందెల నాగార్జున్, కొప్పుల గోవిందరావు తదితరులు పాల్గొన్నారు.
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క