పరిష్కరిస్తాం.. | - | Sakshi
Sakshi News home page

పరిష్కరిస్తాం..

Jun 4 2025 12:23 AM | Updated on Jun 4 2025 12:23 AM

పరిష్కరిస్తాం..

పరిష్కరిస్తాం..

సమస్య చెప్పండి..

పైలట్‌గా రెండు మండలాలు...

భూభారతి చట్టాన్ని ప్రారంభించినప్పుడు రాష్ట్రంలో ఎంపిక చేసిన నాలుగు మండలాల్లో జిల్లాలోని నేలకొండపల్లికి స్థానం దక్కింది. ఈ మండలంలోని రెవెన్యూ గ్రామాల్లో నిర్వహించిన సదస్సుల్లో 3,224 మంది రైతులు సమస్యలపై దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 1,791 దరఖాస్తులు సాదాబైనామాపై ఉండగా, ఇతర సమస్యలపై 1,433 దరఖాస్తులు ఉన్నాయి. ఇందులో 322 దరఖాస్తులు పరిష్కరించి, 953 తిరస్కరించారు. ఇక అసైన్డ్‌ భూములకు సంబంధించి 70 దరఖాస్తులకు ఆమో దం లభించింది. మిగిలిన దరఖాస్తుల పరిశీలన కూడా కొనసాగుతోంది. రెండో విడతలో రాష్ట్రవ్యాప్తంగా 28 మండలాలను ఎంపిక చేయగా.. జిల్లాలోని బోనకల్‌ మండలాన్ని చేర్చారు. ఈ మండలంలో 2,861 దరఖాస్తులు అందగా, 43 పరిష్కరించి మిగతా వాటి పరిశీలనపై దృష్టి సారించారు.

జిల్లావ్యాప్తంగా సదస్సులు

పైలట్‌ ప్రాజెక్టులుగా ఎంపికై న నేలకొండపల్లి, బోనకల్‌ మండలాలు మినహా జిల్లాలోని మిగిలిన అన్ని మండలాల్లోనూ మంగళవారం భూభారతి చట్టం అమలుపై సదస్సులు మొదలయ్యాయి. రెవెన్యూ గ్రామాల వారీగా నిర్వహించే ఈ సదస్సుల్లో తహసీల్దార్‌ సహా ఉద్యోగులు పాల్గొని రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఈనెల 20వ తేదీ వరకు సదస్సుల నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. త్వరలోనే సర్వేయర్ల నియామకం జరగనుండడంతో దరఖాస్తుల ఆధారంగా సర్వే చేసి సమస్యలు పరిష్కరించనున్నారు. తద్వారా గ్రామాల్లో భూసంబంధిత సమస్యలు ఉండవని చెబుతున్నారు.

తొలిరోజు

3,153 దరఖాస్తులు

జిల్లాలో 19 మండలాల పరిధి 37 రెవెన్యూ గ్రామాల్లో తొలిరోజైన మంగళవారం భూభారతి సదస్సులు నిర్వహించినట్లు కలెక్టర్‌ ముజమ్మిల్‌ఖాన్‌ తెలిపారు. ఈమేరకు ఆయా గ్రామాల్లో కలిపి భూసమస్యలపై 3,153 దరఖాస్తులు అందాయని వెల్లడించారు. తహసీల్దార్‌ ఆధ్వర్యాన రెవెన్యూ ఉద్యోగులు సదస్సుల్లో పాల్గొని చట్టంపై అవగాహన కల్పించడమే కాక సమస్యలపై దరఖాస్తులు స్వీకరించారని తెలిపారు. అయితే, రైతులు దరఖాస్తులతో పాటు వారి వద్ద ఉన్న ఆధారిత డాక్యుమెంట్లు సమర్పించాలని కలెక్టర్‌ సూచించారు.

‘భూభారతి’లో భాగంగా

సదస్సులకు శ్రీకారం

ఇప్పటికే నేలకొండపల్లి,

బోనకల్‌ మండలాల్లో నిర్వహణ

కొనసాగుతున్న అక్కడి దరఖాస్తుల పరిష్కారం

మిగతా మండలాల్లో తొలిరోజు

3,153 దరఖాస్తుల స్వీకరణ

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన భూభారతి చట్టం పూర్తిస్థాయి అమల్లో భాగంగా అన్ని మండలాల్లో రెవెన్యూ సదస్సులు

మంగళవారం మొదలయ్యాయి. ఈ చట్టాన్ని ఏప్రిల్‌ 14న ప్రారంభించగా.. పైలట్‌ ప్రాజెక్టుగా రాష్ట్రంలోని నాలుగు మండలాలను ఎంపిక చేశారు. ఇందులో జిల్లాలోని నేలకొండపల్లి ఉండగా, రెవెన్యూ గ్రామాల్లో సదస్సులు నిర్వహించి భూసమస్యలపై దరఖాస్తులు స్వీకరించారు. రెండో విడతగా బోనకల్‌ మండలంలోనూ సదస్సుల నిర్వహణ పూర్తయింది. మిగిలిన మండలాల్లోని రెవెన్యూ గ్రామాల వారీగా మంగళవారం మొదలైన

సదస్సులు ఈనెల 20వ తేదీ వరకు కొనసాగనున్నాయి. – సాక్షిప్రతినిధి, ఖమ్మం

పొరపాట్లకు తావులేకుండా..

రైతులు తమ సమస్యలపై ఇచ్చిన దరఖాస్తులను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు. సమస్యకు కారణాలను ఆరా తీస్తూనే సర్వేనంబర్ల వారీగా, రైతుల వద్ద ఉన్న ఆధారాలను పరిశీలించి పరిష్కారంపై దృష్టి సారించారు. మరోమారు అదే సమస్యపై దరఖాస్తు అందకుండా, పొరపాట్లకు తావులేకుండా పరిష్కరించేలా ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారు. అయితే పైలట్‌ మండలాల్లో ఎక్కువగా సాదాబైనామా దరఖాస్తులే వచ్చాయి. కానీ ఈ అంశం కోర్టు పరిధిలో ఉండడంతో వీటిని పక్కన పెట్టిన అధికారులు మిగతా దరఖాస్తులను త్వరగా పరిష్కరించేలా పరిశీలనలో నిమగ్నమయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement