
కొత్త కార్డులొస్తున్నాయ్..
● ఇప్పటికే 5,298 రేషన్కార్డులు మంజూరు ● చేర్పులతో 61,667మందికి లబ్ధి ● మూడు నెలల బియ్యంతో రెట్టింపు ఆనందం
ఖమ్మం సహకారనగర్: పదేళ్లుగా కొత్త రేషన్కార్డుల మంజూరు లేకపోవడంతో పెద్దసంఖ్యలో పేదలు ఎదురుచూస్తున్నారు. ఈనేపథ్యాన రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు ఇస్తామని ప్రకటించడమే కాక దరఖాస్తులు సైతం స్వీకరించింది. ఈమేరకు విచారణ చేపడుతూ కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయడమే కాక పాత కార్డుల్లో అదనంగా కుటుంబ సభ్యుల పేర్లు సైతం చేరుస్తున్నారు.
విచారణ చేపడుతూ...
జిల్లాలోని 21 మండలాల పరిధిలో 748 రేషన్ షాప్లు ఉన్నాయి. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారికి కార్డులు ఇచ్చేలా అధికార యంత్రాంగం క్షేత్రస్థాయిలో విచారణ వేగవంతం చేసింది. జనవరి నుంచి మే నెల వరకు 5,298 కొత్త రేషన్ కార్డులు జారీ చేశారు. అయితే, ఇంకా 48,971 మంది రేషన్కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న నేపథ్యాన వీటి పరిశీలనలో అధికారులు వేగం పెంచారు. ఇదే సమయాన అనర్హుల కార్డులను తొలగిస్తున్నారు. అంతేకాక కార్డుదారుల పిల్లల పేర్లు, వివాహాలెన వారి భార్య పేరు నమోదుకు 42,787దరఖాస్తులు అందాయి. వీటిని సైతం పరిశీలించి 61,667మంది పేర్లను కార్డుల్లో చేర్చారు. కాగా, కొత్త కార్డుల జారీతో జిల్లాలో రేషన్కార్డుల సంఖ్య 4,15,905కు చేరగా వీటి పరిధిలో 12,03,943మంది లబ్ధిదారులు ఉన్నారు.
ఒకేసారి మూడు నెలల బియ్యం
కొత్తగా రేషన్కార్డు రావడమే కాక ఒకేసారి మూడు నెలల బియ్యం ఇస్తుండడంతో లబ్ధిదారుల్లో హర్షం వ్యక్తమవుతోంది. వర్షాకాలం సీజన్ కారణంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో పాత, కొత్త కార్డుదారులందరికీ మూడేసి నెలల బియ్యాన్ని డీలర్లు సరఫరా చేస్తున్నారు.
అర్హులందరికీ రేషన్కార్డులు
రేషన్కార్డుల కోసం అందిన
దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించాక అర్హులకు
కార్డులు జారీ చేస్తున్నాం.
ఇప్పటికే 5,298 కొత్త రేషన్కార్డులు ఇవ్వగా, మిగతా దరఖాస్తుల పరిశీలన వేగంగా జరుగుతోంది. అర్హులెవరూ
ఈ విషయంలో ఆందోళన చెందాల్సిన పనిలేదు.
– చందన్కుమార్,
జిల్లా పౌరసరఫరాల శాఖాధికారి
జనవరి నుంచి మే వరకు కార్డుల జారీ ఇలా..
కేటగిరీ కార్డులు లబ్ధిదారులు కొత్తవి 5,298 16,127
పేర్ల చేర్పులు 42,787 61,667
మొత్తం 48,085 77,794

కొత్త కార్డులొస్తున్నాయ్..