
కంపు కొడుతున్న పెద్దాస్పత్రి
ఖమ్మంవైద్యవిభాగం: ఖమ్మం జిల్లా ఆస్పత్రిలో కార్మికుల సమ్మె శనివారం మూడో రోజుకు చేరింది. పెండింగ్ వేతనాలు చెల్లించే వరకు విధుల్లో చేరేది లేదని కార్మికులు స్పష్టం చేస్తూ విధులకు దూరంగా ఉన్నారు. దీంతో జనరల్ ఆస్పత్రి, మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో చెత్తాచెదారం, మెడికల్ వ్యర్థాలు పేరుకుపోయాయి. నీటి సరఫరా సక్రమంగా లేకపోవడంతో బాత్రూమ్ల్లో దుర్వాసన వెదజల్లుతోంది. అలాగే తాగునీటి కష్టాలు కూడా మొదలయ్యాయి. సెక్యూరిటీ, పేషంట్ కేర్ సేవల్లోనూ ఇబ్బందులు తలెత్తగా, సెక్యూరిటీ కార్మికులు విధులు దూరంగా ఉండడంతో రక్షణపై ఆందోళన నెలకొంది. కాగా, సమ్మెలో భాగంగా సోమవారం హైదరాబాద్లోని డీఎంఈ కార్యాలయాన్ని ముట్టడించన్నుట్లు కార్మిక సంఘాల నాయకులు ప్రకటించారు. ఈ విషయమై ఆస్పత్రి సూపరింటెండెంట్ ఎల్.కిరణ్కుమార్ను వివరణ కోరగా కార్మికుల వేతనాల సమస్యను డీఎంఈ దృష్టికి తీసుకెళ్లామని, రెండు, మూడు రోజుల్లో శాశ్వత పరిష్కారం లభిస్తుందని తెలిపారు. ఆస్పత్రిలో పారిశుద్ధ్య సమస్య తలెత్తకుండా మున్సిపల్ కార్మికుల సేవలు నియోగించుకుంటున్నామని వెల్లడించారు.
కార్మికుల సమ్మెతో పేరుకుపోయిన వ్యర్ధాలు

కంపు కొడుతున్న పెద్దాస్పత్రి