
మహిళా ఎస్సైతో దురుసు ప్రవర్తన
కల్లూరు: విధినిర్వహణలో ఉన్న కల్లూరు ఎస్ఐ డి.హరితతో దురుసుగా ప్రవర్తించిన ఏడుగురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు కల్లూరు ఏసీపీ రఘు వెల్లడించారు. కల్లూరు పోలీసుస్టేషన్లో శనివారం ఆయన వివరాలు వెల్లడించారు. కల్లూరులోని చౌదరి హోటల్ వద్ద తల్లాడకు చెంది న రాయల రామారావు తదితరులు శుక్రవారం సాయంత్రం మద్యం మత్తులో గొడవ చేస్తున్నారని యాజమాని మాగంటి బోసుబాబు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ సమయానికి వెళ్లిపోయిన రామారావు తిరిగి పలువురితో వచ్చి హోటల్ సిబ్బంది, యాజమానిని బెదిరించాడు. తనపై ఎవరైనా ఫిర్యాదు చేస్తే హోటల్ను నడవనిచ్చేది లేదని హెచ్చరిస్తుండగా ఎస్ఐ హరిత, సిబ్బందితో వచ్చా రు. మద్యం మత్తులో ఉన్న రామారావు, ఆయన అనుచరులను పంపించే ప్రయత్నంలో ఎస్సై, సిబ్బంది విధులను ఆటంకపరుస్తూ దాడి చేశారు. ఈమేరకు ఎస్ఐ ఫిర్యాదుతో పది మందిపై కేసు నమోదు కాగా, ప్రధాన నిందితుడు రాయల రామారావుతో పాటు ఏడుగురిని రిమాండ్కు తరలించినట్లు ఏసీపీ తెలిపారు. కాగా, రామారావుపై గతంలోనూ తల్లాడ పోలీసుస్టేషన్లో కేసు నమోదైందని వెల్లడించారు. ఈ సమావేశంలో సత్తుపల్లి రూరల్ సీఐ ముత్తులింగం, కల్లూరు, పెనుబల్లి ఎస్ఐలు డి.హరిత, వెంకటేష్ పాల్గొన్నారు.
ఏడుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు