తరగతి గది నుంచే భవిష్యత్‌కు పునాది | - | Sakshi
Sakshi News home page

తరగతి గది నుంచే భవిష్యత్‌కు పునాది

Jun 9 2025 12:52 AM | Updated on Jun 9 2025 12:52 AM

తరగతి

తరగతి గది నుంచే భవిష్యత్‌కు పునాది

ఖమ్మంఅర్బన్‌: విద్యార్థుల భవిష్యత్‌ తరగతి గదుల నుంచి ప్రారంభమవుతుందని ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌ డైరెక్టర్‌ కడారి రవీందర్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం పాఠశాల నాలుగో ఏడాదిలోకి అడుగు పెడుతున్న సందర్భంగా విశిష్ట క్యాంపస్‌ ప్రారంభించి మాట్లాడారు. నిర్బంధ విద్యకు తాను పూర్తిగా వ్యతిరేకమని, విలువలతో కూడిన విద్య, అభివృద్ధికి దోహదపడే టెక్నాలజీతో విద్యా పద్ధతులు తమ పాఠశాలలో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. మంత్రి పొంగులేటి క్యాంప్‌ కార్యాలయ ఇన్‌చార్జ్‌ దయాకర్‌రెడ్డి, ప్రిన్సిపాల్‌ రణధీర్‌ తదితరులు పాల్గొన్నారు.

రైతుకు ఏరువాక

అగ్రి ఎక్స్‌లెన్స్‌ అవార్డు

ఎర్రుపాలెం: మండలంలోని మీనవోలు గ్రామానికి చెందిన ప్రకృతి సేద్యం చేస్తున్న రైతు కుడుముల వెంకట్రామిరెడ్డికి ఏరువాక అగ్రి ఎక్స్‌లెన్స్‌ అవార్డు దక్కింది. హైదరాబాద్‌లో ఆది వారం నిర్వహించిన కార్యక్రమంలో ప్రముఖ సినీనటుడు, మాజీ మంత్రి బాబూమోహన్‌, సినీ నటి కవిత, నవ నిర్మాణ ఫౌండేషన్‌ చైర్మన్‌ పొన్నాల రాంబాబు తదితరులు రైతుకు అవార్డుతో పాటు ప్రశంసా పత్రం, రూ.2,116 నగదు అందజేశారు.

ఆటో పల్టీ..

ఏడుగురికి గాయాలు

కామేపల్లి: ఆటో పల్టీ కొట్టిన ఘటనలో పలువురికి గాయాలైన ఘటన ఆదివారం మండలంలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. మహబూబాబాద్‌ జిల్లా బయ్యారం గ్రామానికి చెందిన పలువురు లింగాల క్రాస్‌ రోడ్డు నుంచి డోర్నకల్‌ వైపు ఆటోలో వెళ్తుండగా బండిపాడు స్టేజీ సమీపంలోని మూలమలుపు వద్ద ఆటో అదుపుతప్పి పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఓ మహిళకు తీవ్ర గాయాలు కాగా మరో ఆరుగురుకి స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను డోర్నకల్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

సరిహద్దు గ్రామాల్లో తనిఖీలు

చర్ల: మండలంలోని సరిహద్దు గ్రామాల్లో పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. ఆదివారం చర్లలో జరిగే వారపు సంతకు సరిహద్దు ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ఆదివాసీలు నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసేందుకు వచ్చారు. వారి మాటున మావోయిస్టులు రావచ్చునన్న అనుమానంతో పోలీసులు తనిఖీలు చేపట్టాయి. ప్రతీ ఒక్కరిని నిశితంగా పరిశీలించా రు. సీఐ రాజువర్మ నేతృత్వంలో ఎస్‌ఐలు నర్సిరెడ్డి, కేశవ్‌ సివిల్‌, స్పెషల్‌ పార్టీ పోలీసులు పాల్గొన్నారు.

అడవులను

రక్షించుకుందాం

భద్రాద్రి ఎస్పీ రోహిత్‌రాజు

చండ్రుగొండ : పర్యావరణ పరిరక్షణ కోసం అడవులను రక్షించుకుందామని ఎస్పీ రోహిత్‌రాజు పేర్కొన్నారు. మండలంలోని బెండాలపాడు శివారు కనకగిరి అటవీ ప్రాంతాన్ని ఆదివారం ఆయన సందర్శించారు. గుట్టలపైభాగంలో ఉన్న వీరభద్రస్వామి ఆలయాన్ని సందర్శించి, పూజలు చేశారు. అనంతరం పర్యాటకుల కోసం గుట్టలపైభాగంలో ఏర్పాటు చేసిన వ్యూ పాయింట్‌ను పరిశీలించారు. అనంతరం బ్యాంబో క్లస్టర్‌ను సందర్శించారు. వెదురు ఉత్పత్తులను తిలకించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు అడవులను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. అడవులను, అటవీ సంపదను కొల్లగొట్టేవారిపట్ల కఠినంగా వ్యవహరించాలని, అందుకోసం పోలీసుశాఖ సహకారం అందిస్తుందని తెలిపారు. డీఎస్పీ అబ్దుల్‌ రెహమాన్‌, ఫారెస్టు రేంజర్‌ ఎల్లయ్య పాల్గొన్నారు.

తరగతి గది నుంచే  భవిష్యత్‌కు పునాది 1
1/2

తరగతి గది నుంచే భవిష్యత్‌కు పునాది

తరగతి గది నుంచే  భవిష్యత్‌కు పునాది 2
2/2

తరగతి గది నుంచే భవిష్యత్‌కు పునాది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement