
ఘనంగా అర్ధ శతాబ్దపు వేడుకలు
మధిర: ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అర్ధ శతాబ్దపు వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. జూనియర్ కళాశాలను స్థాపించి 50 ఏళ్లు గడిచిన సందర్భంగా స్వర్ణోత్సవ వేడుకలను వైభవంగా నిర్వహించారు. కళాశాల ఆవరణను మామిడి తోరణాలు, కొబ్బరి ఆకులతో అలంకరించి, అతిథుల రాక కోసం రెడ్కార్పెట్ వేశారు. ప్రత్యేక సెట్టింగ్లతో బ్యాచ్లవారీగా గ్యాలరీలు, కుర్చీలను ఏర్పాటు చేశారు. 1970 – 1972 మొట్టమొదటి బ్యాచ్ నుంచి 2025 వరకు బ్యాచ్లవారీగా ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేసి పూర్వ విద్యార్థుల పేర్లను నమోదు చేయించుకున్నారు. నాటి గురువులు, పూర్వ విద్యార్థులు వృద్ధాప్యంలోకి చేరడంతో పాటు వీఐపీల రాకతో అక్కడ ప్రత్యేక వైద్యశిబిరం ఏర్పాటు చేశారు. 55 ఏళ్ల పూర్వ విద్యార్థులు ఒకేవేదిక పైకి చేరుకున్నారు. నాటి మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. గురువులతో పాటు దేశ విదేశాల్లో ఉన్నత స్థాయిలో స్థిరపడిన ప్రభుత్వ జూనియర్ కళాశాల పూర్వ విద్యార్థులను ఘనంగా సన్మానించారు. వేలాదిమంది తరలిరావడంతో కళాశాలలో పండగ వాతావరణం నెలకొంది.

ఘనంగా అర్ధ శతాబ్దపు వేడుకలు