
ఆయిల్పామ్లో అంతర పంటలతో లాభాలు
ఖమ్మంఅర్బన్: రైతులు ఆయిల్పామ్ సాగు చేస్తూనే నాలుగు రకాల అంతర పంటలు వేసుకోవచ్చని, తద్వారా అదనపు లాభాలు పొందొ చ్చని జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమల అధికారి ఎం.వీ.మధుసూదన్ తెలిపారు. రఘునాథపాలెం, ఖమ్మం బాలపేటల్లోని ఆయిల్పామ్ తోటల్లో బుధవారం ఆయన రైతులతో సమావేశమయ్యారు. ఆయిల్పామ్లో వక్క, కోకో, మునగ, సుగంధ ద్రవ్యాల పంటలే కాక కూరగాయలు పంటలు కూడా సాగు చేసుకోవచ్చన్నారు. తద్వారా ఆయిల్పామ్ చేతికొచ్చేలోగా ఈ పంటలతో పెట్టుబడి ఖర్చులు తీరతాయని తెలిపారు. ఏడీఏ కొంగర వెంకటేశ్వర్లు, ఉద్యానశాఖ అధికారి నగేష్తో పాటు రామకృష్ణ, చంద్రశేఖర్, మానుకొండ రాధాకిషోర్, రామచంద్రు, కిషోర్ తదితరులు పాల్గొన్నారు.
నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు
ఏన్కూరు: రైతులకు నకిలీలు, అనుమతి లేని విత్తనాలు అమ్మితే డీలర్లపై కఠిన చర్యలు తప్పవని జిల్లా వ్యవసాయ శాఖాధికారి డి.పుల్లయ్య హెచ్చరించారు. వైరా ఏడీఏ టి.కరుణశ్రీతో కలిసి బుధవారం ఆయన ఏన్కూరులోని పలు షాపుల్లో తనిఖీ చేశారు. విత్తనాలు, ఎరువులు నిల్వల రికార్డులను పరిశీలించాక డీఏఓ మాట్లాడారు. రైతులు కూడా ప్రతీ కొనుగోలుపై బిల్లు తీసుకుని పంట కాలం పూర్తయ్యే భద్రపర్చాలని సూచించారు. అనంతరం ఏన్కూరులో సబ్సిడీపై అందించే జీలుగ విత్తన ప్యాకెట్ల నిల్వలను పరిశీలించారు. పచ్చిరొట్ట సాగుతో రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించవచ్చని ఆయన తెలిపారు. ఆతర్వాత రైతు వేదికలో ఏఈఓలతో సమీక్షించి ఫార్మర్ రిజిస్ట్రీపై సూచనలు చేశాక ఫౌండేషన్ విత్తనాలు పంపిణీ చేశారు. ఏఓ ఏ.నరసింహారావు, ఏఈఓలు బాలకృష్ణ, శ్రీకాంత్, కమలాకర్, నవ్య, భవ్య, భాగ్యలహరి పాల్గొన్నారు.
రేషన్ దుకాణాలు,
మార్కెట్ల తనిఖీ
ఖమ్మం సహకారనగర్/ఖమ్మం వ్యవసాయం: జిల్లా కేంద్రంలోని పలు రేషన్ దుకాణాలను అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు బియ్యం పంపిణీపై ఆరా తీశారు. డీఎం శ్రీలత, డీలర్ జానీమియా తదిరులు పాల్గొన్నారు. అలాగే, ఖమ్మం కొత్త బస్టాండ్ పక్కన, వీడీవోస్ కాలనీల్లో ఉన్న సమీకృత మార్కెట్లను అదనపు కలెక్టర్ పి శ్రీనివాసరెడ్డి సందర్శించారు. మార్కెట్ల నిర్వహణ, స్టాళ్లు ఖాళ్లీగా ఉండడంపై ఆరా తీశారు. అలాగే, వీడీవోస్ కాలనీ సమీకృత మార్కెట్లో సేంద్రియ రైతు బజార్ ఏర్పాట్లను పరిశీలించారు. జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి ఎం.ఏ.అలీం పాల్గొన్నారు.
సమస్యల పరిష్కారానికి
వేదికగా ‘భూభారతి’
ముదిగొండ: భూసమస్యల పరిష్కార వేదికగా భూభారతి చట్టం నిలవనుందని అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి తెలిపారు. ముదిగొండ మండలం గోకినేపల్లిలో బుధవారం జరిగిన రెవెన్యూ సదస్సులో పాల్గొన్న ఆయన భూసమస్యలపై రైతుల నుండి దరఖాస్తుల స్వీకరణను పరిశీలించారు. అనంతరం అదనపు కలెక్టర్ మాట్లాడుతూ కొత్త చట్టం ద్వారా లావాదేవీల సేవలు, రిజిస్ట్రేషన్, ఆర్ఓఆర్ మార్పులు, చేర్పులు వంటి సేవలు సులభతరమవుతాయని తెలిపారు. సదస్సులను రైతులు సద్వినియోగం చేసుకుంటూ సమస్యలపై దరఖాస్తులు ఇవ్వాలని సూచించారు. తహసీల్దార్ సునీత ఎలిజబెత్, ఆర్ఐ వహీదా సుల్తానా తదితరులు పాల్గొన్నారు.

ఆయిల్పామ్లో అంతర పంటలతో లాభాలు

ఆయిల్పామ్లో అంతర పంటలతో లాభాలు