
తెలంగాణ ఉద్యమకారుడు ఆశీర్వాదం మృతి
తల్లాడ: తల్లాడ మండలం పినపాకకు చెందిన తెలంగాణ ఉద్యమకారుడు మోదుగు ఆశీర్వాదం(69) గురువారం గుండెపోటుతో మృతి చెందారు. ఆయనకు ముగ్గురు కుమారులు ఉన్నారు. యాభై ఏళ్ల క్రితం కానిస్టేబుల్గా విధులు నిర్వర్తించిన ఆయన ఉద్యోగానికి రాజీనామా చేసి ఉద్యమంలో పాల్గొన్నారు. కొన్నాళ్లు కాంగ్రెస్లో కొనసాగగా, 2001లో టీఆర్ఎస్లో చేరి మలిదశ ఉద్యమంలో చురుగ్గా వ్యవహరించారు. బీఆర్ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా, మధిర నియోజకవర్గ ఇన్చార్జ్గానూ పనిచేసిన ఆశీర్వాదం తల్లాడలో కమ్యూనిటీ హాల్ భవన నిర్మాణ సంఘం అధ్యక్షుడిగా పనిచేశారు. కాగా, ఆశీర్వాదం మృతదేహం వద్ద మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య నివాళులర్పించారు. అలాగే, బీఆర్ఎస్ మండల అధ్యక్ష, కార్యదర్శులు రెడ్డెం వీరమోహన్రెడ్డి, దుగ్గిదేవర వెంకట్లాల్తో పాటు వజ్రాల రామిరెడ్డి, కోడూరి వీరకృష్ణ, బద్దం కోటిరెడ్డి, దగ్గుల శ్రీనివాసరెడ్డి, కాంపాటి జమలయ్య, జీవీఆర్, వివిధ పార్టీల నాయకులు సైతం నివాళులర్పించి ఆశీర్వాదం కుటుంబీకులను పరామర్శించారు.

తెలంగాణ ఉద్యమకారుడు ఆశీర్వాదం మృతి