
పైలెట్.. సక్సెస్
ఇలా పరిశీలన..
రెవెన్యూ రికార్డులతో పాటు క్షేత్ర స్థాయి తనిఖీతో దరఖాస్తులను ధ్రువీకరించడానికి తహసీల్దార్, సీనియర్ అసిస్టెంట్ లేదా గిర్దావర్, సర్వేయర్, జూనియర్ అసిస్టెంట్, కంప్యూటర్ ఆపరేటర్ నేతత్వంలో బృందాలను ఏర్పాటు చేశారు. ప్రతి బృందానికి నాలుగు రెవెన్యూ గ్రామాలను కేటాయించారు. ఖమ్మం ఆర్డీఓ జారీ చేసిన నోటీసులను దరఖాస్తుదారులకు అందజేయడంతోపాటు ఎవరైనా అభ్యంతరం తెలియజేయదలిస్తే ఏడు రోజుల్లోపు నేలకొండపల్లిలోని తహసీల్దార్ కార్యాలయంలో డాక్యుమెంటరీ ఆధారాలను సమర్పించాల్సి ఉంటుంది. ఈ మేరకు గ్రామ పంచాయతీలు, ఎంపీడీఓ, తహసీల్దార్, వ్యవసాయ కార్యాలయాలతో పాటు పోలీస్ స్టేషన్ నోటీసు బోర్డుల్లో ప్రదర్శించారు.
సాక్షిప్రతినిధి, ఖమ్మం: జిల్లాలో పైలెట్ మండలంగా ఎంపికై న నేలకొండపల్లిలో భూభారతి కొత్త ఆర్ఓఆర్ చట్టం విజయవంతమైంది. 14 రోజుల పాటు రెవెన్యూ సదస్సులు నిర్వహించి భూ సమస్యలన్నీ ఒక దగ్గరకు చేర్చారు. 11 రకాల భూ సమస్యలపై ఈ సదస్సుల్లో రెవెన్యూ అధికారులకు 3,224 దరఖాస్తులు అందాయి. రెవెన్యూ యంత్రాంగం ఆరు బృందాలుగా.. ఒక్కో బృందం నాలుగు రెవెన్యూ గ్రామాల్లో ఈనెల 15 వరకు దరఖాస్తులను పరిశీలన పూర్తి చేయాలి. ఆ తర్వాత తహసీల్దార్ నుంచి ఆర్డీఓకు క్లియరెన్స్ వస్తుంది. ఆ తర్వాత ఆర్డీఓ ప్రొసీడింగ్స్ ఇస్తారు. ఈ ప్రక్రియ అంతా పూర్తయిన తర్వాత దరఖాస్తుదారు ఇప్పటికే పాస్ బుక్ కలిగి ఉంటే అది నవీనీకరిస్తారు. లేదంటే కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకం జారీ చేస్తారు.
సదస్సులతో అవగాహన..
భూ భారతి అమలుకు రాష్ట్రంలో పైలెట్గా నాలుగు మండలాలను తీసుకోగా ఇందులో నేలకొండపల్లి కూడా ఉంది. ఈ పథకం అమలుకు ముందు అందరికీ అవగాహన కల్పించేలా ప్రభుత్వం సదస్సులకు శ్రీకారం చుట్టింది. ఈ మండలంలో గతనెల 17 నుంచి 30 వరకు 23 రెవెన్యూ గ్రామాల్లోని 32 గ్రామ పంచాయతీల్లో సదస్సులు నిర్వహించారు. తహసీల్దార్, సీనియర్ అసిస్టెంట్, ఆర్ఐ, సర్వేయర్, జూనియర్ అసిస్టెంట్, కంప్యూటర్ ఆపరేటర్లు పాల్గొని భూభారతి చట్టం విధి విధానాలు, పనితీరును వివరించారు.
దండిగా దరఖాస్తులు..
ఈ సదస్సులతో పాటు ప్రత్యేకంగా తహసీల్దార్ కార్యాలయంలో హెల్ప్డెస్క్ పెట్టారు. రెవెన్యూ సదస్సుల్లో దరఖాస్తు ఇవ్వలేని వారు ఈ హెల్ప్డెస్క్లో అందజేశారు. సదస్సుల్లో 2,690 దరఖాస్తులు రాగా హెల్ప్డెస్క్కు 534 అందాయి.
సాదాబైనామాకే ఎక్కువ..
11 రకాలకు సంబంధించిన భూ సమస్యలపై 3,224 దరఖాస్తులు రాగా, ఇందులో అత్యధికంగా సాదాబైనామా కింద క్రమబద్ధీకరణకు 1,264 అర్జీలు (40 శాతం) రావడం గమనార్హం. అయితే సీసీఎల్ఏ అందించిన డేటా ప్రకారం మండలంలో సాదాబైనామా క్రమబద్ధీకరణకు 3,417 దరఖాస్తులు ఉన్నాయి.
ప్రస్తుతం భూభారతి చట్టంలో సాదాబైనామా క్రమబద్ధీకరణకు సంబంధించి 2020 అక్టోబర్ 12 నుంచి నవంబర్ 10 వరకు అందినవి మినహా.. ఇతర దరఖాస్తులను ప్రాసెస్ చేయానికి ఎటువంటి నిబంధన లేదు. దీంతో మిగిలిన దరఖాస్తులను పక్కన పెట్టారు. ప్రభుత్వ అనుమతితో సీసీఎల్ఏ జారీ చేయబోయే నోటిఫికేషన్ అందిన తర్వాత ఈ దరఖాస్తులను ప్రాసెస్ చేసేందుకు డాక్యుమెంటరీ ఆధారాలను సమర్పించమని దరఖాస్తుదారులను కోరనున్నారు.
ఈనెల 15లోగా తనిఖీలు పూర్తి..
బృందాలు క్షేత్రస్థాయి తనిఖీ ప్రక్రియను ఈనెల 15లోగా పూర్తి చేస్తాయి. ఇందుకోసం షెడ్యూల్ రూపొందించుకుని గ్రామాలను సందర్శిస్తున్నాయి. వీటిపై ఏమైనా అభ్యంతరాలు వ్యక్తమై.. తదుపరి విచారణ అవసరమైతే ఈనెల 16 నుంచి 22 వరకు మరోసారి గ్రామాలను సందర్శిస్తాయి. ఆ తర్వాత ఖమ్మం ఆర్డీఓ, నేలకొండపల్లి తహసీల్దార్ అందించిన లాగిన్లో చేసిన సిఫార్సుల ఆధారంగా ఈనెల 25 నుంచి 30 వరకు ఆమోదించబడిన దరఖాస్తుదారుల ఈకేవైసీని పొందడం ద్వారా ప్రొసీడింగ్లు జారీ చేస్తారు. దీని ప్రకారం దరఖాస్తుదారుడు ఇప్పటికే పాస్ పుస్తకం కలిగి ఉంటే దాకాన్ని ఆధునికీకరిస్తారు. లేదంటే కొత్త పాస్బుక్ జారీ చేస్తారు.
నేలకొండపల్లిలో
విజయవంతమైన భూ భారతి
14 రోజులు 32 పంచాయతీల్లో రెవెన్యూ సదస్సులు
11 రకాల భూ సమస్యలపై
3,224 దరఖాస్తులు
అత్యధికంగా సాదాబైనామా
క్రమబద్ధీకరణకు 1,264..