తగ్గిన ఉష్ణోగ్రతలు | - | Sakshi
Sakshi News home page

తగ్గిన ఉష్ణోగ్రతలు

May 5 2025 8:48 AM | Updated on May 5 2025 8:48 AM

తగ్గిన ఉష్ణోగ్రతలు

తగ్గిన ఉష్ణోగ్రతలు

ఖమ్మంవ్యవసాయం: రెండు రోజులుగా ఈదురుగాలులతో పాటు వర్షం కురవడంతో జిల్లా వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు తగ్గాయి. దీంతో వాతావరణం చల్లబడింది. ఈనెల 6, 7 తేదీల వరకు ఇలాగే ఉంటుందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. శనివారం ఎర్రుపాలెంలో గరిష్ట ఉష్ణోగ్రత 42.5 డిగ్రీలు, అత్యల్పంగా ఏన్కూరు మండలం తిమ్మారావుపేటలో 38.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఆదివారం నాగులవంచలో గరిష్టంగా 37.3 డిగ్రీలు, రావినూతలలో 37.3, వైరా ఏఆర్‌ఎస్‌ 36.8, కుర్నవల్లి, వైరా, తల్లాడలో 36.5, ఏన్కూరులో 35.9, కూసుమంచి 35.7, లింగాల, గేటు కారేపల్లిలో 35.6, బచ్చోడులో 35.4, పల్లెగూడంలో 35.3, కాకరవాయిలో 35.2, పమ్మిలో 35.1, తిమ్మారావుపేట, రఘునాథపాలెంలో 34.9, బాణాపురం, పెనుబల్లిలో 34.8, పంగిడిలో 34.6, నేలకొండపల్లిలో 34.5, ఖమ్మం ఖానాపురం, ప్రకాశ్‌నగర్‌, తిరుమలాయపాలెం, చింతకానిలో 34.2, ఖమ్మం ఎన్‌ఎస్‌టీ గెస్ట్‌హౌస్‌ వద్ద 34.1, పెద్దగోపతిలో 34 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కాగా, అకాల వర్షాలతో వరి, మొక్కజొన్న, మామిడి, బొప్పాయి, కూరగాయల పంటలు దెబ్బతింటుండగా రైతులు ఆందోళన చెందుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement