
పకడ్బందీగా సదరమ్ క్యాంపుల నిర్వహణ
ఖమ్మంవైద్యవిభాగం: సదరమ్ క్యాంప్లకు వచ్చే దివ్యాంగులు ఇబ్బంది పడకుండా ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ ఆదేశించారు. ఖమ్మం జనరల్ ఆస్పత్రిలో క్యాంపును మంగళవారం పరిశీలించిన ఆమె పాత సర్టిఫికెట్ స్థానంలో యూడీఐడీ కార్డుల జారీ, వైకల్య శాతం నిర్ధారణపై ఆరా తీశారు. అలాగే, పలువురు దివ్యాంగులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నాక వైద్యులకు సూచనలు చేశారు. ఆతర్వాత ఈఎన్టీ ఓపీ విభాగానికి వెళ్లగా డ్యూటీ డాక్టర్ సెలవులో ఉండడం, సీనియర్ రెసిడెంట్ వైద్య సేవలు అందిస్తుండడాన్ని గుర్తించారు. అయితే, సీనియర్ రెసిడెంట్కు అర్హత ఉందని అధికారులు చెప్పడంతో అసిస్టెంట్ ప్రొఫెసర్తోనే ఓపీ సేవలు అందించాలని ఆదేశించారు. అలాగే, సర్జరీ విభాగం, ఆరోగ్య మహిళ విభాగం, తెలంగాణ డయోగ్నస్టిక్ హబ్, ఎంసీహెచ్, ఎస్ఎన్సీయులో అదనపు కలెక్టర్ పరిశీలించారు. మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ ఎస్.రాజేశ్వరరావు, ఆస్పత్రి సూపరింటెండెంట్ ఎల్.కిరణ్కుమార్, ఆర్ఎంఓలు బి.రాంబాబు, రాథోడ్ వినాయక్, టీఎస్ఎంఎస్ఐడీసీ ఈఈ ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు.
ఇందిరమ్మ ఇళ్ల సర్వే పరిశీలన
కొణిజర్ల: మండలంలోని తుమ్మలపల్లిలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల సర్వేను అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ తనిఖీ చేశారు. ఇందిరమ్మ కమిటీ ఆధ్వర్యాన లబ్ధిదారులను ఎంపిక చేశాక, గెజిటెడ్ అధికారితో మరోమారు పరిశీలన చేపడుతున్నారు. ఈనేపథ్యాన తుమ్మలపల్లిలో 29 ఇళ్లకు జాబితా ఆధారంగా తనిఖీ చేపట్టగా అదనపు కలెక్టర్ వివరాలు తెలుసుకున్నారు. ఎంపీడీఓ ఏ.రోజారాణి, ప్రత్యేకాధికారి ఏ.మనోజ, పంచాయతీ కార్యదర్శి కె.కిషోర్ పాల్గొన్నారు.
పెద్దాస్పత్రిని తనిఖీ చేసిన
అదనపు కలెక్టర్ శ్రీజ