తహసీల్దార్‌ పేరుతో బ్యాంక్‌ రుణానికి దరఖాస్తు | - | Sakshi
Sakshi News home page

తహసీల్దార్‌ పేరుతో బ్యాంక్‌ రుణానికి దరఖాస్తు

Mar 24 2025 2:11 AM | Updated on Mar 24 2025 2:10 AM

కూసుమంచి: తన పేరు జంగం బాలరాజు అని, తాను కూసుమంచి తహసీల్దార్‌గా పనిచేస్తున్నానంటూ నకిలీ గుర్తింపు కార్డుతో బ్యాంకు లోన్‌కు దరఖాస్తు చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జంగం బాలరాజు అనే పేరుతో ఓ వ్యకి హైదరాబాద్‌లోని జూబ్లిపుర ఎస్‌బీఐ బ్రాంచ్‌లో వ్యక్తిగత రుణం కోసం ఇటీవల దరఖాస్తు చేసుకున్నాడు. అక్కడి అధికారులు నిర్ధారణ నిమిత్తం కూసుమంచి బ్యాంకుకు అతడి వివరాలు పంపించారు. దీంతో కూసుమంచి బ్యాంకు మేనేజర్‌ తహసీల్దార్‌ కార్యాలయంలో ఆరా తీయగా ప్రస్తుతం కరుణశ్రీ తహసీల్దార్‌గా ఉన్నారని, గతంలో కూడా బాలరాజు పేరుతో ఎవరూ పని చేయలేదని తేలింది. దీంతో నకిలీ అధికారిగా గుర్తించి అక్కడి అఽధికారులకు సమాచారం అందించడంతో వారు విచారణ చేపట్టారు. కాగా బాలరాజు పేరుతో తహసీల్దార్‌గా నమ్మించేందుకు జిల్లా కలెక్టర్‌ జారీ చేసినట్లుగా కలెక్టర్‌ ముద్రలు, ఫోర్జరీ సంతకంతో నకిలీ గుర్తింపుకార్డు సృష్టించి లోన్‌ పొందేందుకు ప్రయత్నించాడు. గుర్తింపు కార్డులో తన తండ్రి పేరు చంద్రమౌళి అని, కూసుమంచిలో నివాసం ఉంటున్నట్లు ఇంటి నంబర్‌ 7–24 అని పేర్కొన్నాడు. ఏకంగా తహసీల్దార్‌ నంటూ బ్యాంకును బురిడీ కొట్టించేందుకు బాలరాజు ప్రయత్నించడంతో అధికారులు అప్రమత్తమై విచారణ చేపట్టారు.

నకిలీ అధికారిగా గుర్తించిన బ్యాంకర్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement