
సంచార నియమాలను పాటించండి
బళ్లారి రూరల్ : విద్యార్థులు చదువు, క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు స్వచ్ఛందంగా నగరంలో సంచార నియమాలను పాటించాలని దావణగెరె ఎంపీ డాక్టర్ ప్రభా మల్లికార్జున తెలిపారు. జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో మంగళవారం బాపూజీ సముదాయ భవన్లో విద్యార్థులకు రోడ్డు భద్రతా జాగృతి కార్యక్రమాన్ని ప్రారంభించి ఆమె మాట్లాడారు. విద్యార్థులకు బంగారు భవష్యత్తు ఉంది. రోడ్డు దాటేటప్పుడు ట్రాఫిక్ సిగ్నల్స్ చూసి సురక్షితంగా వెళ్లాలన్నారు. పాదచారులు సంచార నియమాలను పాటించాలన్నారు. సంచార నియమాలను పాటించేలా పాఠశాలల్లో కెప్టెన్, వైస్ కెప్టెన్లను నియమించి విద్యార్థులను జాగృత పరచాలన్నారు. 18 ఏళ్లు పైబడివారు మాత్రమే వాహనాలను నడపాలన్నారు. జిల్లా ఎస్పీ ఉమా ప్రశాంత్, ఏఎీస్పీ మంజునాథ, కేఎస్ఆర్టీసీ విభాగ నియంత్రణాధికారి కిరణ్కుమార్, డీడీపీఐ డీఎస్పీ కొట్రేశ్ తదితరులు పాల్గొన్నారు.
దావణగెరె ఎంపీ డాక్టర్ ప్రభా మల్లికార్జున