
కన్నతల్లిని కాటికి పంపాడు
బనశంకరి: డబ్బు కోసం కుమారుడు కన్న తల్లిని గొంతునులిమి హత్య చేశాడు. ఈ అమానుష ఘటన ఉడుపి సమీపంలో మణిపాల్లో జరిగింది. పద్మబాయి (45)ని కుమారుడు ఈశనాయక్ (26) బలిగొన్నాడు. 18వ తేదీ రాత్రి పద్మాబాయి నడుము నొప్పితో ఉడుపి జిల్లా ఆసుపత్రిలో చేరింది. ఆమె చెల్లెలు శిల్పాకు పోన్చేసిన ఈశనాయక్ వైద్యం కోసం డబ్బు పంపాలని కోరాడు, శిల్పా ఆన్లైన్ ద్వారా కొంత డబ్బు పంపింది. 19వ తేదీ ఉదయం శిల్పాకు ఫోన్ చేసిన ఈశనాయక్.. అమ్మ చనిపోయిందని చెప్పాడు. శిల్పా వెళ్లి చూడగా పద్మబాయి గొంతు కింద ఎర్రగా కమిలి ఉంది. అనుమానంతో మణిపాల్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. వైద్యులు పోస్టుమార్టం చేయగా, గొంతు పిసికి చంపారని నిర్ధారించారు. కుమారుడు ఈశనాయక్ డబ్బుకోసం ఒత్తిడి చేశాడని, ఆమె ఇవ్వను అనడంతో ప్రాణాలు తీశాడని తేలింది. హంతకున్ని అరెస్ట్చేసి విచారణ చేపట్టారు.