
ఓం నమో వేంకటేశాయ
మిత్రులను బలిగొన్న ఫారం పాండ్
మాలూరు: తిరుమల తరువాత అంతటి ఆలయంగా పేరుపొందిన కోలారు జిల్లా మాలూరు తాలూకాలోని చిక్కతిరుపతిలో ఉన్న ప్రసిద్ధ శ్రీ ప్రసన్న వెంకటరమణ స్వామి దేవాలయంలో స్వామివారికి విశేష పూజలను నిర్వహించారు. 10 వేల మందికి పైగా భక్తులు వచ్చి స్వామి వారిని దర్శనం చేసుకున్నారు. జిల్లానుంచే కాకుండా రాష్ట్రం, పొరుగు రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ప్రధాన అర్చకులు గోపాలకృష్ణ భారద్వాజ్, ఎన్ శ్రీధర్ నేతృత్వంలో స్వామి వారికి అభిషేకం, నైవేద్యం, విశేష అలంకారం, అర్చనలు జరిగాయి. మూల విగ్రహానికి పంచామృత అభి షేకం గావించారు. భక్తులకు అన్న సంతర్పణ జరిగింది.
శివమొగ్గ: ఇద్దరు యువకులు ప్రమాదవశాత్తు పొలంలోని ఫారం పాండ్లో పడి మరణించిన విషాద ఘటన శివమొగ్గ తాలూకాలోని కుంసి ఠాణా పరిధిలోని యాదవాల గ్రామంలో శనివారం రాత్రి జరిగింది. మృతులు యాదవాల గ్రామానికి చెందిన గౌతమ్ (22), కుబరగుండివాసి చిరంజీవి (22). సెలవులు కావడంతో గౌతమ్, 10 మంది స్నేహితులతో కలిసి తన తోటకు వెళ్లారు. ఈ సమయంలో పెద్ద ఫారంపాండులో ఈత కొట్టాలని దిగారు. ముగ్గురు దిగగా పై ఇద్దరూ మునిగిపోయారు. మిగతావారు కాపాడాలని ప్రయత్నించినా సాధ్యం కాలేదు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఫైర్ సిబ్బందితో వచ్చి గాలించి మృతదేహాలను వెలికితీసి శివమొగ్గ ప్రబుత్వ ఆస్పత్రికి తరలించారు. కొడుకుల మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.

ఓం నమో వేంకటేశాయ