
క్షయపై జాగృతి కల్పించండి
రాయచూరు రూరల్: జిల్లాలో క్షయకు అడ్డుకట్ట వేసేందుకు ప్రజల్లో జాగృతి కల్పించాలని జెడ్పీ సీఈఓ రాహుల్ తుకారం ఫాండ్వే సూచించారు. ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయంలో ఆదివారం డీహెచ్ఓ సురేంద్రబాబుతో కలిసి పోస్టర్లు విడుదల చేశారు. ఆ యన మాట్లాడుతూ క్షయను పూర్తిగా నిర్మూలించేందుకు ఆరోగ్య కార్యకర్తలు ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. జిల్లారోగ్యశాఖ అధికారి సురేంద్ర బాబు మాట్లాడుతూ దగ్గు, జ్వరం, అకలి నశించిపోవడంవంటి లక్షణాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలన్నారు. జిల్లాలో 67,388 మందికి క్షయ నిర్ధారణ పరీక్షలు చేయగా 176 మందికి క్షయ ఉన్నట్లు తేలిందన్నారు.