
హెచ్ఎస్ఆర్ లేఔట్ క్లబ్ అధ్యక్షుడిగా శంకర్రెడ్డి
బొమ్మనహళ్లి : బెంగళూరు నగరంలోని హెచ్ఎస్ఆర్ లేఔట్లో ఉన్న హెచ్ఎస్ఆర్ క్లబ్ పాలకవర్గానికి ఎన్నిక జరిగింది. అధ్యక్ష స్థానానికి వీ.టి.శంకర్రెడ్డి, ప్రముఖ న్యాయవాది ఎ.ఎం.సురేష్ రెడ్డి పోటీ పడ్డారు. వీటి శంకర్ రెడ్డి విజయం సాధించారు. ఉపాధ్యక్షుడిగా శ్రీనివాస్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కార్యదర్శిగా జీ.కృష్ణారెడ్డి, ఎ.ఎం.నరిసింహమూర్తి విజయం సాధించారు. మేనేజింగ్ కమిటీ 10 స్థానాలకు ఎన్నిక జరగ్గా ఆర్.సతీష్ 1619 ఓట్లు, మోహిత్ హెచ్.ఎస్.రెడ్డి 1586, దర్సన్ ఆర్. 1580, ప్రజ్వల్ ఎస్.వి. 1545, జీ.శ్రీనివాస్ రెడ్డి 1515,ఆశోక్ కుమార్ ఎస్. 1508, ఆంజినప్ప 1461, మధుకృష్ణారావు బీ.1392, రుద్రేష్ ఎస్.ఎన్. 1368, నవీన్ జయరామ్ కూమార్తె 1215 ఓట్లు సాధించి విజయం సాధించారు. బొమ్మనహళ్లి ఎమ్మెల్యే ఎం.సతీష్ రెడ్డి, జేడీఎస్ మాజీ రాజ్యసభ సభ్యుడు డి,కుపెంద్ర రెడ్డి, ఏపీలోని చిత్తురు జిల్లా శ్రీకాళహస్తి వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డితోపాటు అనేక మంది ప్రముఖులు హాజరై ఓటు హక్కు వినియోగించుకున్నారు.