
ప్రైవేటు బస్సుకు ప్రమాదం
రాయదుర్గం టౌన్: రాయదుర్గం మండలం జుంజురాంపల్లి గ్రామ సమీపంలో ఓ ప్రైవేటు బస్సు అదుపు తప్పి కల్వర్టుపైకి దూసుకెళ్లింది. మంగళవారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటనలో ముగ్గురు ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు. రోజూ బెళుగుప్ప నుంచి గుండ్లపల్లి, కెంచానపల్లి మీదుగా బెంగళూరుకు ఎస్ఆర్జే ప్రైవేటు బస్సు వెళుతుంది. బెళుగుప్ప నుంచి బయల్దేరి జుంజురాంపల్లి చేరుకోవాల్సి ఉండగా సమీపంలో అదుపుతప్పి కల్వర్టుపై దూసుకెళ్లి నిలిచిపోయింది. జుంజురాంపల్లికి చెందిన లక్ష్మీదేవి అనే ప్రయాణికురాలు ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొంది ఇంటికి వెళ్లింది.
నిర్మాణంలో ఉన్న పెట్రోల్
బంక్లో చోరీ
మైసూరు: నిర్మాణ దశలోని పెట్రోల్ బంక్లో చోరీ జరిగింది. ఈఘటన మైసూరులోని ఉత్తనహళ్లి వద్ద ఉన్న రింగ్ రోడ్డులో జరిగింది. వైశాలి అనే వ్యక్తి స్పటిక సర్వీస్ పెట్రోల్ బంక్ పేరుతో నిర్మాణ పనులు చేస్తున్నారు. పనివాళ్లు అక్కడే షెడ్లో ఆశ్రయం పొందుతున్నారు. సోమవారం రాత్రి దుండగులు షెడ్ తలుపునకు గొళ్లెం వేశారు. తర్వాత గది వద్ద ఉంచిన రూ.3.40లక్షల విలువైన పెట్రోల్ పంప్ మోటార్, కేబుల్, వెల్డింగ్ మిషన్తో పాటు విలువైన వస్తువులను చోరీ చేసుకెళ్లారు. దక్షిణ గ్రామీణ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.
పురస్కారాలు..
ప్రతిభావంతులకు ప్రోత్సాహం
మైసూరు : నగరంలోని సరస్వతీపురంలోని శ్రీకృష్ణధామ్లో మంగళవారం ప్రతిభాపురస్కారాల ప్రదానోత్సవం జరిగింది. పది, ఇంటర్లో అత్యధిక మార్కులు సాధించిన 83 మంది బ్రాహ్మణ విద్యార్థులకు శ్రీ కృష్ణమిత్ర బోర్డు, శ్రీక్రిష్ణ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతిభాపురస్కారాలు అందజేశారు. చిన్మయ పీయూ కళాశాల ప్రిన్సిపాల్ ఎం.ఎస్. శరత్కుమార్ మాట్లాడుతూ ప్రతిభ పురస్కారాలు ప్రతిభావంతులకు మరింత ప్రోత్సాహం ఇస్తాయన్నారు. శ్రీ కృష్ణమిత్ర బోర్డు అధ్యక్షుడు గోపాలక్రిష్ణ, గౌరవ కార్యదర్శి గురుప్రసాద్, ట్రస్ట్ ఉపాధ్యక్షుడు రవిశాస్త్రి , పీజీఎస్ చంద్రశేఖర్, కార్యదర్శి కే.వి. శ్రీధర్, కోశాధికారి ఎం. రాఘవేంద్రరావు, శ్రీవత్స, మంగళ పాల్గొన్నారు.

ప్రైవేటు బస్సుకు ప్రమాదం