
పాల డెయిరీ కార్యదర్శి తీరును నిరసిస్తూ ధర్నా
మండ్య : పాండవపుర తాలూకా నరహళ్లి గ్రామంలో ఉన్న పాలడెయిరీ కార్యదర్శి తీరును నిరసిస్తూ పాడి ఉత్పత్తిదారులు మంగళవారం ఆందోళన నిర్వహించారు. డెయిరీ వద్దకు పాలు తీసుకొని వచ్చి నేలపై పోసి నిరసన వ్యక్తం చేశారు. పాల డెయిరీ కార్యదర్శి కాళమరిగౌడ తమకు ఎలాంటి బోనస్లు ఇవ్వడం లేదని, కనీసం ప్రోత్సాహ ధనం కూడా పంపిణీ చేయలేదని పాడి రైతులు మండిపడ్డారు. పాల బిల్లులు సక్రమంగా చెల్లించడం లేదన్నారు. కార్యదర్శి మహిళల పట్ల అసభ్యకరంగా వ్యవహరిస్తున్నాడని ఆరోపించారు. పాలడెయిరీలో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని, కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.