దొంగల బీభత్సం | - | Sakshi
Sakshi News home page

దొంగల బీభత్సం

Jun 25 2025 7:02 AM | Updated on Jun 25 2025 7:02 AM

దొంగల బీభత్సం

దొంగల బీభత్సం

మహిళను బంధించి నగలు దోపిడీ

మైసూరు : చామరాజ్‌నగర్‌ జిల్లా రామాపూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో దొంగలు బీభత్సం సృష్టించారు. హనూర్‌ తాలూ రామాపూర్‌లోని ఖదీమా అనే మహిళ ఇంటిలోకి దుండగులు చొరబడ్డారు. ఆమె చేతులు, కాళ్లు కట్టేసి బంగారు నగలు దోచుకొని పారిపోయారు. బాధితురాలు కట్లు విప్పుకొని పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించి దుండగుల కోసం గాలింపు చేపట్టారు.

బైక్‌లు ఢీ.. ఒకరి మృతి

మైసూరు : కొల్లేగల్‌ తాలూకాలోని తెరంబల్లి గ్రామంలోని బస్టాండు సమీపంలో మంగళవారం రెండు బైక్‌లు పరస్పరం ఢీకొన్నాయి. కొల్లేగల్‌ తాలూకాలోని తెరంబల్లి గ్రామానికి చెందిన శివమల్లప్ప(55), సాగర్‌(26)లు గాయపడ్డారు. ఆస్పత్రికి తరలించగా శివమల్లప్ప మృతి చెందాడు. అగర్‌మాంబల్లి పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.

పేద బ్రాహ్మణుల సంక్షేమానికి కృషి

బొమ్మనహళ్లి : పేదరికంలో ఉన్న బ్రాహ్మణుల సంక్షేమానికి ప్రత్యేక పథకం రూపొందిస్తున్నట్లు అఖిల కర్ణాటక బ్రహ్మణ మహాసభ అధ్యక్షుడు ఎస్‌.రఘునాథ్‌ తెలిపారు. ఆనేకల్‌ తాలూకా ఆత్తిబెలిలో ఉన్న శ్రీనంజుండేశ్వర సముదాయ భవనంలో శ్రీగాయత్రీ విప్రబృందం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆచార్య త్రయర జయంతి, ప్రతిభా పురస్కారాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. బ్రాహ్మణ మహాసభ పదాధికారుల ఎన్నిక ఇటీవల పూర్తయ్యిందన్నారు. సముదాయ ప్రజలు తమపై ఎంతో నమ్మకం ఉంచారన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేసి తీరుతామని అన్నారు. అనంతరం సముదాయంలోని ప్రతిభావంత విద్యార్థులకు పురస్కారాలు అందజేశారు. మహాసభ ఉపాధ్యాక్షుడు బిదరగుప్పె వి.అచ్యుత్‌మూర్తి, రాష్ట్ర నాయకుడు ఎస్‌.సుదర్శన్‌, ఎం.కే.రామ్‌, ప్రసాద్‌, రథయాత్ర సురేష్‌, రవి.కుమార్‌, సతీష్‌ పాల్గొన్నారు.

మలేమాదేశ్వరస్వామి బెట్టలో బైక్‌లు దగ్ధం

మైసూరు : చామరాజ్‌నగర్‌ జిల్లా హనూరు తాలూకా మలేమాదేశ్వరస్వామి కొండలో భక్తులు పార్కింగ్‌ చేసిన మూడు బైక్‌లు దగ్ధమయ్యాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి మదేశ్వరస్వామి కొండకు వచ్చిన భక్తులు సుంకమ్మ నిలయం వద్ద బైక్‌లను పార్కింగ్‌ చేస్తుంటారు. ఈక్రమంలో మంగళవారం వేకువజామున మంటలు చెలరేగి మూడు ద్విచక్రవాహనాలు దగ్ధమయ్యాయి. మంగళవారం ఉదయం పోలీసులు వచ్చి పరిశీలించారు. ఎవరైనా నిప్పు పెట్టారా? ప్రమాదవశాత్తూ కాలిపోయాయా అనేది దర్యాప్తులో తేలాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement