
అథ్లెటిక్స్లో చిక్కబళ్లాపురం క్రీడాకారుల ప్రతిభ
చిక్కబళ్లాపురం: బెంగళూరులోని కంఠీరవ క్రీడా మైదానంలో ఈనెల 22 నుంచి 24వరకు జరిగిన రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో చిక్కబళ్లాపురం జిల్లా క్రీడాకారులు ప్రతిభ చాటారు. హైజంప్లో దీక్ష ప్రతిభ చాటి వెండి పతకం సాధించగా షార్ట్ఫుట్లో హర్షన్ యాదవ్ వెండి పతకం సాధించారు. త్రోబాల్లో ఆఫీరా, వెండి, షార్ట్ఫుట్లో కవన ఆర్ కంచు పతకం సాధించారు. విజేతలను చిక్కబళ్లాపురం జిల్లా అథ్లెటిక్ సంఘం అధ్యక్షుడు కేవీ నవీన్కిరణ్ అభినందంచారు, ప్రధాన కార్యదర్శి మంచనబలె శ్రీనివాస్, సభ్యులు లక్ష్మిశేఖర్ పాల్గొన్నారు