మోదీ పాలన సువర్ణాధ్యాయం | - | Sakshi
Sakshi News home page

మోదీ పాలన సువర్ణాధ్యాయం

Jun 11 2025 11:32 AM | Updated on Jun 11 2025 11:32 AM

మోదీ పాలన సువర్ణాధ్యాయం

మోదీ పాలన సువర్ణాధ్యాయం

సాక్షి,బళ్లారి: 2014లో భారత ప్రధానమంత్రిగా బాధ్యతలు తీసుకున్న నరేంద్ర మోదీ వరుసగా మూడుసార్లు దేశ ప్రధానమంత్రి పదవి చేపట్టిన తర్వాత 11 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్నారని, ఈ 11 ఏళ్ల మోదీ పాలన దేశంలో సువర్ణాక్షరాలతో లిఖించదగినదని మాజీ మంత్రి శ్రీరాములు పేర్కొన్నారు. ఆయన మంగళవారం నగరంలోని మోకా రోడ్డులోని బీజేపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత అత్యంత మంచి పాలన మోదీ అందించారన్నారు. ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకలిస్తున్నారని కొనియాడారు. నెహ్రు, ఇందిరాగాంధీ ఇద్దరూ కుటుంబ పాలన సాగించారని ఆరోపించారు.

ఆర్టికల్‌–370 రద్దు చారిత్రాత్మకం

ప్రధాని మోదీ పాలనలో జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్‌– 370ను రద్దు చారిత్రాత్మకం. ఉగ్రవాదం అణిచివేత, పేదరిక నిర్మూలన, జాతీయ రహదారులు, ప్రాజెక్టుల నిర్మాణం ఇలా చెప్పుకుంటూ పోతే ఒక సువర్ణయుగంగా పాలన సాగిస్తున్నారన్నారు. 60 సంవత్సరాల కాంగ్రెస్‌ పాలనకు, బీజేపీ అఽధికారంలో ఉన్న 11 ఏళ్ల పాలనకు ఎంతో తేడా ఉందని కొనియాడారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యేలు గాలి సోమశేఖరరెడ్డి, సోమలింగప్ప, జిల్లా బీజేపీ అధ్యక్షుడు అనిల్‌ కుమార్‌ మోకా, బీజేపీ నాయకులు గుత్తిగనూరు విరుపాక్షిగౌడ, కే.ఎస్‌.దివాకర్‌, హనుమంతప్ప, కార్పొరేటర్‌ మోత్కూరు శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

నెహ్రు, ఇందిరలది కుటుంబ పాలన

దేశాభివృద్ధిలో మోదీ పాత్ర కీలకం

కూకటివేళ్లతో ఉగ్రవాద నిర్మూలన

మాజీ మంత్రి శ్రీరాములు వెల్లడి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement