
నైతికత ఉంటే రాజీనామా చేయండి
హుబ్లీ: ఆర్సీబీ జట్టు విజయోత్సవం చేయరాదని పోలీస్ శాఖ సూచించినా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి క్రెడిట్ కొట్టేయాలనే దుగ్ధతో కార్యక్రమాన్ని నిర్వహించి 11 మంది అమాయకుల మృతికి కారకులైన వారిద్దరూ నైతికత ఉంటే తక్షణమే రాజీనామా చేయాలని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి సవాల్ చేశారు. నగరంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇంటలిజెన్స్ శాఖ ఏం చేస్తోంది? అని ప్రశ్నించారు. ప్రస్తుతం ప్రభుత్వ అధికారులపై చర్యలు తీసుకున్నారు. ఈ విషయంలో కూడా కావాల్సిన అధికారులకు అన్నం, ఇష్టం లేని అధికారులకు సున్నంలా వ్యవహరించారు. సీఎం సిద్దరామయ్య తక్షణమే ఉప ముఖ్యమంత్రి డీకే.శివకుమార్తో రాజీనామా తీసుకోవాలన్నారు. మీ సెల్ఫీ క్రెడిట్కు 11 మంది బలి అయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు.
దుర్ఘటనపై సీఎం, డీసీఎంలకు
కేంద్ర మంత్రి సవాల్