
తొలి ప్రయత్నంలోనే సివిల్స్ విజేత
హుబ్లీ: నగరంలోని అక్షయ కాలనీ నివాసి డాక్టర్ ఇషికాసింగ్ తన తొలి ప్రయత్నంలోనే యూపీఎస్సీ పరీక్షల్లో 206వ ర్యాంక్ సాధించడం ద్వారా జిల్లాకు, రాష్ట్రానికి ఎనలేని కీర్తిని తెచ్చి పెట్టారు. రాజనగర కేంద్రీయ విద్యాలయంలో ఎస్ఎస్ఎల్సీ, గ్లోబల్ పీయూ సైన్స్ కళాశాలలో చదివిన ఇషికా 2023లో కేఎంసీ ఆస్పత్రిలో డిస్టింక్షన్తో ఎంబీబీఎస్ ఉత్తీర్ణురాలయ్యారు. ఇక యూపీఎస్సీ పరీక్ష కోసం ఏడాది పాటు మాత్రమే ఆన్లైన్లో సదరు పరీక్షకు శిక్షణ తీసుకున్నారు. దీంతో తొలి ప్రయత్నంలోనే విజేతగా నిలిచారు. ఈమె తండ్రి రాజేష్సింగ్ వ్యాపారవేత్త కాగా తల్లి కిరణ్సింగ్ హిందీ లెక్చరర్. ఈ సందర్భంగా పీయూఎస్సీ విజేత డాక్టర్ ఇషికాసింగ్ మాట్లాడుతూ తల్లిదండ్రులు, సోదరుడు రిషిత్ సింగ్ ఆశయం, ప్రోత్సాహం వల్ల తాను ఈ స్థాయికి చేరానన్నారు. తాను ఐఎఫ్ఎస్ లేదా ఐఏఎస్ కావాలని కల కన్నానన్నారు. ఈ రెండింటిలో ఏది వచ్చినా తనకు సంతోషమేనన్నారు. యూపీఎస్సీ సాధనకు నిరంతర అధ్యయనం అవసరం అన్నారు. కోచింగ్ ఉన్నా మన అధ్యయనంపై సదా జాగరూకతతో ఉండాలన్నారు. ప్రశ్న పత్రికల అవలోకనం, ఎప్పటికప్పుడు పరీక్షలను ఎదుర్కోవడం ఎలా అన్నది అలవరుచుకోవాలన్నారు. దీంతో మనలోని దౌర్భల్యాలు తెలుస్తాయి. సానుకూల దృక్పథం ఏర్పడుతుందన్నారు. యూపీఎస్సీ ఆశావహులు ఈ విషయాలపై అవగాహన పెంచుకోవాలన్నారు.
హుబ్లీ డాక్టర్ను వరించిన 206వ ర్యాంక్