
పిడుగుపాటుకు 36 జీవాల మృతి
హొసపేటె: పిడుగుపాటుకు 36 గొర్రెలు మృతి చెందిన సంఘటన కొప్పళ జిల్లా యలబుర్గా తాలూకాలోని గంధాల గ్రామంలో శనివారం సాయంత్రం జరిగింది. పిడుగుపాటుకు గ్రామంలోని గవిసిద్దప్ప నవలహళ్లి అనే గొర్రెల కాపరికి చెందిన 36 గొర్రెలు చనిపోయాయి. గొర్రెలు చనిపోవడంతో గొర్రెల కాపరి గవిసిద్దప్ప నవలహల్లి స్పృహ తప్పి పడిపోయాడు. పిడుగుపాటుకు గొర్రెలు చనిపోవడంతో గొర్రెల పెంపకందారుకు భారీ నష్టం వాటిల్లింది. బాధితుడు గవిసిద్దప్ప కుటుంబం పరిహారం అందించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఘటనా స్థలానికి తహసీల్దార్ బసవరాజ్ తెన్నళ్లి, పశువైద్యాధికారి సిద్దప్ప చవాన్, బేవూరు పోలీస్ స్టేషన్ ఏఎస్ఐ మహంతేష్ సజ్జన్ తదితరులు పరిశీలించి, ప్రకృతి వైపరీత్య సహాయ నిధి నుంచి పరిహారం అందిస్తామని హామీ ఇచ్చారు.
కూడ్లిగి తాలూకాలో..
విజయనగర జిల్లా కూడ్లిగి తాలూకాలో ఆదివారం సాయంత్రం వివిధ ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురిశాయి. హరవాడి గ్రామంలో పిడుగుపాటుకు 3 మేకలు చనిపోయాయి. గ్రామానికి చెందిన కుమారస్వామి తన మేకలను మేపడానికి పొలానికి వెళ్లినప్పుడు సాయంత్రం ఉరుములతో కూడిన వర్షం ప్రారంభమైంది. మేకలు చెట్టు కింద తలదాచుకోగా ఈ సంఘటన జరిగింది. గుడేకోటె పోలీస్ స్టేషన్ అధికారులు, గ్రామ నిర్వాహకుడు, పశువైద్య అధికారి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.
షాక్తో స్పృహ కోల్పోయిన గొర్రెల కాపరి