సరుకు వాహనం బోల్తా.. 22 మందికి గాయాలు | - | Sakshi
Sakshi News home page

సరుకు వాహనం బోల్తా.. 22 మందికి గాయాలు

Apr 22 2025 12:46 AM | Updated on Apr 22 2025 12:46 AM

సరుకు

సరుకు వాహనం బోల్తా.. 22 మందికి గాయాలు

హొసపేటె: కొప్పళ జిల్లా కుష్టిగి తాలూకాలోని బాలయ్య క్యాంపునకు వెళ్తుండగా కలమంగి సమీపంలో గూడ్స్‌ వాహనం టైరు పేలి బోల్తా పడటంతో 22 మంది గాయపడ్డారు. బాలయ్య క్యాంపులో నూతన వధూవరులకు నీళ్లు పోసే కార్యక్రమం ఉండటంతో శనివారం ఉదయం గుమగేరా నుంచి నూతన వధూవరులతో సహా 25 మందితో వెళ్తున్న గూడ్స్‌ వాహనం బోల్తా పడింది. ఈ ఘటనలో గుమగేరా రామప్ప, మంజునాథ్‌, ప్రశాంత్‌, సరస్వతి, వైష్ణవి, దేవమ్మ, గంగప్ప, గంగమ్మ, జయశ్రీ, పూజ, నాగప్ప, చంచలమ్మ, మంజునాథ, సిద్దలింగ, పరశురామ గుమగేరా, మంజమ్మ, ద్యామమ్మ, యమనూరప్ప, దురుగప్ప, యమనూరు, నీలవ్వ, అడివెప్ప తదితరులందరికీ స్వల్ప గాయాలవడంతో వైద్యులు చికిత్స అందించారు. ఘటనపై తుర్విహాళ్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది.

సరుకు వాహనం బోల్తా.. 22 మందికి గాయాలు1
1/1

సరుకు వాహనం బోల్తా.. 22 మందికి గాయాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement