
స్వయం ఉపాధి శిక్షణతో ఆర్థిక స్వావలంబన
హొసపేటె: స్వయం ఉపాఽధి శిక్షణ కేంద్రం గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధిని సృష్టించడం ద్వారా స్వావలంబన, ఆర్థికంగా సాధికారత సాధనకు సహాయపడిందని ఎస్బీఐ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ రాఘవేంద్రరావు అన్నారు. ఆయన సోమవారం నగరంలోని పుణ్యమూర్తి సర్కిల్ సమీపంలోని పాత ప్రభుత్వ బాలికల పీయూ కళాశాల ఆవరణలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించి మాట్లాడారు. ఈ శిక్షణా సంస్థ విజయనగర జిల్లాలోని నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి శిక్షణను అందిస్తోందన్నారు. మహిళలు, పురుషులకు కుట్టు శిక్షణ, జ్యూట్ బ్యాగ్ల తయారీ, అగర్బత్తీల తయారీ, మోటార్ రివైండింగ్, పంప్సెట్ మరమ్మతు, మొబైల్ మరమ్మతులపై శిక్షణ అందిస్తారన్నారు. ఈ ప్రాంతంలోని నిరుద్యోగ యువత శిక్షణ సంస్థ ప్రయోజనాలను సద్వినియోగం చేసుకుని స్వయం ఉపాధి పొందాలన్నారు. హొసపేటె ప్రాంతీయ కార్యాలయం జనరల్ మేనేజర్ అమిత్ గోయల్, గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ డైరెక్టర్ గిరిధర్, అసిస్టెంట్ మేనేజర్ ధనుంజయ, మేనేజర్ ఈరన్న, లక్ష్మీకాంత్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.