
కఠోర శ్రమే విజయానికి సోపానం
రాయచూరు రూరల్: నేటి ఆధునిక యుగంలో కఠిన పరిశ్రమతో విద్యార్థుల విజయం సాధ్యమని సిద్ధారూడ అరూఢ జ్యోతి శాంతాశ్రమ మఠాధిపతి నిజానంద స్వామీజీ పేర్కొన్నారు. రాయచూరు వాల్మీకి మహర్షి విశ్వవిద్యాలయంలో వేదాంత కళాశాల ఆధ్వర్యంలో ఎన్ఎస్ఎస్ శిబిరంలో పాల్గొని ఆయన మాట్లాడారు. జ్ఞాన సముపార్జనకు సాహిత్యం, సంస్క్రతి, సేవలు చేదోడు వాదోడుగా ఉంటాయన్నారు. విద్యార్థులు పాఠ్య పుస్తకాల్లో పాఠ్యాంశాలకు మాత్రమే పరిమితం కాకుండా సమాజానికి ఉపయోగ పడే విధంగా అవగాహన కలిగి ఉండాలన్నారు. శరణబసవ, రశ్మిరాణి, అగ్నిహోత్రి, వేదాంత కళాశాల అధికారి రాకేష్ రాజలబండి, నిఖిల్, రమేష్ నాయక్, వీరేష్, వినోద్లున్నారు.