వింటేజ్‌ కార్ల విలాసం | - | Sakshi
Sakshi News home page

వింటేజ్‌ కార్ల విలాసం

Apr 1 2024 1:50 AM | Updated on Apr 1 2024 6:13 PM

విధానసౌధ ముందు అలరించిన అపురూప వింటేజ్‌ కార్లు  - Sakshi

విధానసౌధ ముందు అలరించిన అపురూప వింటేజ్‌ కార్లు

బనశంకరి: లోక్‌సభ ఎన్నికలలో ఓటర్ల జాగృతి కోసం ఈసీ, ప్రభుత్వం తరచూ వినూత్న కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. ఈ దిశలో పాతకాలం నాటి వింటేజ్‌ కార్లు, బైకుల ర్యాలీ ని ఆదివారం విధానసౌధ ముందు నిర్వహించారు. జిల్లా ఎన్నికల అధికారి, బీబీఎంపీ కమిషనర్‌ తుషార్‌ గిరినాథ్‌ ప్రారంభించారు.

లోక్‌సభ ఎన్నికల మొదటి విడత పోలింగ్‌ ఏప్రిల్‌ 26వ తేదీ జరగనుంది, పోలింగ్‌ శాతం పెంపు కోసం జాగృతి చేస్తున్నట్లు తెలిపారు. వింటేజ్‌ కార్లు, ద్విచక్ర వాహనాలు ర్యాలీ ఇందులో భాగమని చెప్పారు. కార్ల ర్యాలీ విధానసౌధ నుంచి ప్రారంభమై ఇన్‌ఫ్యాంట్రీ రోడ్డు, ఎంజీ రోడ్డు, చిన్నస్వామి స్టేడియం, ట్రినిటి సర్కిల్‌, రెసిడెన్సీ రోడ్డు మీదుగా కంఠీరవ క్రీడా మైదానానికి చేరుకొంది. సుమారు వందేళ్ల నాటి అపురూపమైన కార్లు దూసుకుపోతుంటే నగరవాసులు అబ్బురంగా తిలకించారు.

మైసూరులో ఈవీఎంల పనితీరుపై అవగాహన శిబిరం 1
1/3

మైసూరులో ఈవీఎంల పనితీరుపై అవగాహన శిబిరం

ర్యాలీని ప్రారంభిస్తున్న దృశ్యం 2
2/3

ర్యాలీని ప్రారంభిస్తున్న దృశ్యం

3
3/3

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement