కష్టజీవులపై మృత్యు పంజా | - | Sakshi
Sakshi News home page

కష్టజీవులపై మృత్యు పంజా

Sep 25 2023 12:48 AM | Updated on Sep 25 2023 7:49 AM

- - Sakshi

 కర్ణాటక: ఇద్దరు యువకులు స్వంతకాళ్లపై నిలబడి కుటుంబాలకు ఆధారంగా ఉన్నారు. విధులు ముగించుకొని వస్తున్న వారిపై మృత్యువు పంజా విసిరి కుటుంబాల్లో చీకట్లు నింపింది. బుల్లెట్‌–స్కూటీ ఢీకొని ఇద్దరు యువకులు మృతి చెందిన ఘటన రూరల్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలోని పెరుమాచనహళ్లి దగ్గ శనివారం ఆర్ధరాత్రి జరిగింది. హుల్లుగుమ్మనహళ్లికి చెందిన వెంకటేశ్‌ (31) పట్టణంలోని ఓ షోరూమ్‌లో పనిచేస్తున్నాడు.

అదేవిధంగా చేలూరు తాలూకా చిలకలనేర్పకి చెందిన శ్రీనివాస్‌(36) బెంగళూరులో పనిచేస్తున్నాడు. వెంకటేశ్‌ బుల్లెట్‌ వాహనంలో, శ్రీనివాస్‌ స్కూటీలో స్వగ్రామాలకు వస్తుండగా పెరుమాచనహళ్లి వద్ద పరస్పరం ఢీకొన్నారు. ఇద్దరు తీవ్ర గాయాలతో మృతి చెందారు. పోలీసులు మృతదేహాలను ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement