
కర్ణాటక: ప్రేమికుల వీడియో తీసి వారిని బ్లాక్మెయిన్ చేస్తున్న ఇద్దరిని బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు నయనా, కిరణ్లు కెంగేరి మొయిన్రోడ్డులోని కెంచనాపురలో శెట్టి లంచ్ హోమ్ అనే హోటల్ను నడుపుతున్నారు.
ఇందులో ఇద్దరు ప్రేమికులకు రూం ఇచ్చారు. ఇందులో రహస్యంగా కెమరాను అమర్చి వీడియో తీశారు. వీడియోను అశ్లీలంగా ఎడిట్ చేసి యువతికి కిరణ్ వాట్సాప్ చేశాడు. అనంతరం డబ్బులు ఇవ్వకుంటే తల్లిదండ్రులకు పంపుతానంటూ బెదిరించారు. లక్ష రూపాయలు డిమాండ్ చేసిన వీరు వీడియోను సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేస్తామని బెదిరించేవారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు.