అక్రమ సంబంధం రగడ
కర్ణాటక: టైల్స్ షాపు యజమానిపైన దాడి చేసి హత్య చేసిన కేసులో తుమకూరు గ్రామీణ పోలీసులు నలుగురు నిందితులను అరెస్టు చేశారు. మే నెల 20వ తేదీన రాత్రి సుమారు 9 గంటల సమయంలో చిక్కమగళూరు చెందిన జాకీర్ అనే వ్యాపారిని కొందరు వేట కొడవళ్ళతో దాడి చేసి హతమార్చారు.
పోలీసులు విచారణ జరిపి కుబ్రాన్, రబాని, వికాస్, మరో యువతిని అరెస్టు చేశారు. హతుడు, నిందితులు అందరూ చిక్కమగళూరుకు చెందినవారే. జాకీర్కు– కుబ్రాన్ కుమార్తె అయిన రబానికి మధ్య గతంలో గొడవ జరిగింది. ఈ కక్షతో కుబ్రాన్, రబాని, రబాని ప్రియుడు వికాస్, మరో అమ్మాయి జుకీ కలిసి జాకీర్ హత్యకు పథకం వేశారు.
అక్రమ సంబంధం రగడ
ఈ హత్య జరగడానికి మూల కారణం జాకీర్కు, రబానీకి మధ్య అక్రమ సంబంధం ఉందని, ఈ కారణంతో కుబ్రాన్ అతనితో అనేకసార్లు ఘర్షణ పడ్డాడని తెలిసింది. జాకీర్ చిక్క మగళూరు ఇక్కడికి వచ్చి తుమకూరులో టైల్స్ వ్యాపారం చేయడానికి షాపును ఏర్పాటు చేశాడు. ఇంతలో కుబ్రాన్ ముఠా వచ్చి అతన్ని హత్య చేసిందని పోలీసులు తెలిపారు. నిందితులను అరెస్టు చేసి మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నారు.