1.86 లక్షల మంది రైతులు.. రూ.201 కోట్లు | - | Sakshi
Sakshi News home page

1.86 లక్షల మంది రైతులు.. రూ.201 కోట్లు

Jun 24 2025 3:29 AM | Updated on Jun 24 2025 3:29 AM

1.86

1.86 లక్షల మంది రైతులు.. రూ.201 కోట్లు

కరీంనగర్‌ అర్బన్‌: రైతు భరోసా సాయం ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నెల 16 నుంచి పెట్టుబడి సాయం రైతుల ఖాతాకు చేరుతుండగా ఇప్పటివరకు 1,86,952 మందికి సాయమందగా మొత్తం రూ.201కోట్లు ఖాతాలకు చేరాయి. జిల్లాలో మొత్తం రైతులు 2,10,904 రైతులు కాగా రూ.211.90 కోట్లు వానాకాలం రైతు భరోసాగా ప్రభుత్వం కేటాయించింది. వారం రోజుల వ్యవధిలో తొలుత రెండెకరాలు, మూడెకరాలు, నాలుగు ఎకరాలు, ఐదు ఎకరాలు ప్రామాణికంగా తీసుకోగా సోమవారం వరకు తొమ్మిది ఎకరాలలోపు రైతులకు రైతు భరోసా చేరింది. ఎకరాన రూ.6 వేల చొప్పున ఈ నెల 16న 1,24,727 మంది రైతులకు రూ.65.79 కోట్లు, 17న 27,307 మందికి రూ.40.25 కోట్లు, 19న 15,995 మంది రైతులకు రూ.32.91 కోట్లు, 20న 9,955 మంది రైతులకు రూ.26.39 కోట్లు, 21న 5,684 మంది రైతులకు రూ.19.36 కోట్లు, 23న 3,284 మంది రైతులకు గానూ రూ.17.11 కోట్లు ఖాతాలకు చేరాయి. విత్తనాలు, ఎరువులు, ఇతర సాగు ఖర్చులకు గానూ వినియోగించాలని జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి వివరించారు. కాగా.. మంగళవారం సాయంత్రం సీఎం రేవంత్‌రెడ్డి రైతు భరోసా, సన్నబియ్యం బోనస్‌ లబ్ధిదారులను ఉద్దేశించి రైతునేస్తం కార్యక్రమంలో వీసీ ద్వారా రైతులతో ముఖాముఖి మాట్లాడనున్నారని పేర్కొన్నారు. జిల్లాలోని 45 రైతు వేదికల్లో రైతులు హాజరు కావాలని కోరారు.

ఖైదీల యోగ క్షేమాలు తెలుసుకున్న జడ్జి

కరీంనగర్‌క్రైం: కరీంనగర్‌ జిల్లా జైలును సోమవారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి శివకుమార్‌, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కె.వెంకటేశ్‌తో కలిసి సందర్శించారు. ఖైదీల యోగ క్షేమాలు, భోజన వసతులు, న్యాయసేవా, ఆరోగ్య సమస్యల గురించి తెలుసుకున్నారు. క్యాంటీన్‌, ఆసుపత్రి, ములాఖత్‌, ఫోన్‌, లైబ్రరీ, వంటశాల, ఇండస్ట్రీలలో పనితీరు పరిశీలించారు. కొత్త చట్టాలు వివరించారు. మహిళా జైలును కూడా సందర్శించి కేసుల వివరాలు, బాగోగులు, సౌకర్యాలు అడిగి తెలుసుకున్నారు. లాయర్లను పెట్టుకునే స్థోమత లేనివారికి ప్రభుత్వం తరఫున లాయర్లను నియమిస్తామని చెప్పారు. జైలు సూపరింటెండెంట్‌ విజయ డేని జైలర్లు పి.శ్రీనివాస్‌, బి.రమేశ్‌ తదితరులు ఉన్నారు.

కాళేశ్వరంపై

విషం కక్కడంలో

చంద్రబాబు హస్తం

కరీంనగర్‌: కాళేశ్వరం ప్రాజెక్టుపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ విషం కక్కడంలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు హస్తం ఉందని బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు ఆరోపించారు. సోమవారం కరీంనగర్‌లో మాట్లాడారు. తెలంగాణ గోదావరి నీళ్లను తరలించుకుని బనకచర్ల ప్రాజెక్టును నిర్మించుకునే కుయుక్తులో భాగంగా కేంద్ర మంత్రి సంజయ్‌ను వాడుకుంటూ కాళేశ్వరంపై విషం కక్కిస్తున్నారని మండిపడ్డారు. గోదావరి నీళ్లను సముద్రంలో కలవనీయకుండా అడ్డుకునేందుకు గతంలో ఏ ప్రభుత్వం కృషి చేయలేదన్నారు. కనీస విషయ పరిజ్ఞానం లేకుండా కేవలం కేసీఆర్‌పై విమర్శలు, దూషణలు, ఆరోపణలే పనిగా పెట్టుకుని పబ్బం గడుపుకుంటున్న కేంద్ర మంత్రి వైఖరిపై ప్రజలు చీత్కరించుకుంటున్నారని అన్నారు. ఫోన్‌ట్యాపింగ్‌ విషయంలో దమ్ముంటే సిట్‌కు హాజరు కావొద్దని సవాల్‌ చేశారు. కేంద్ర మంర్రి సంజయ్‌ కరీంనగర్‌లో కూర్చుని కేసీఆర్‌ కుటుంబంపై విమర్శలు చేయడం తప్ప చేసిందేమీ లేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా మాట్లాడినందుకు ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని ముగ్గురు మంత్రులు, బండి సంజయ్‌ను ప్రజలు బహిష్కరించాలన్నారు. చల్ల హరిశంకర్‌, పొన్నం అనిల్‌గౌడ్‌, షౌకత్‌ అలీ, యాదగిరి పాల్గొన్నారు.

1.86 లక్షల మంది రైతులు.. రూ.201 కోట్లు
1
1/2

1.86 లక్షల మంది రైతులు.. రూ.201 కోట్లు

1.86 లక్షల మంది రైతులు.. రూ.201 కోట్లు
2
2/2

1.86 లక్షల మంది రైతులు.. రూ.201 కోట్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement