
విన్నపాలు వినవలె
● ప్రజావాణిలో బాధితుల మొర ● అర్జీలు స్వీకరించిన కలెక్టర్ పమేలా సత్పతి
మొత్తం అర్జీలు: 263
మునిసిపల్ కార్పొరేషన్: 62
డీపీవో: 14
ఆర్డీవో కరీంనగర్: 11
మానకొండూర్ తహసీల్దార్: 09
కరీంనగర్ రూరల్ తహసీల్దార్: 09
తిమ్మాపూర్ తహసీల్దార్: 08
ఎంపీడీవో హుజూరాబాద్: 07
కరీంనగర్ అర్బన్: విన్నపాలు వినవలె..నంటూ కలెక్టరేట్ బాట పట్టారు బాధితులు. జిల్లా నలుములల నుంచి ప్రజలు అర్జీలతో ఆశగా ఉన్నతాధికారులను ఆశ్రయించారు. సోమవారం కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణికి వినతులు వెల్లువలా రాగా.. కలెక్టర్ పమేలా సత్పతి, అదనపు కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, లక్ష్మీకిరణ్ స్వీకరించారు. ప్రధానంగా భూ సమస్యలు, పింఛన్లు, ఇందిరమ్మ ఇళ్లు, నివేసన స్థలాల అర్జీలు రాగా వ్యక్తిగత సమస్యలను ఏకరవు పెట్టారు.
వృద్ధాశ్రమ భవనానికి అనుమతి ఇప్పించండి
2003 నుంచి అనాథ వృద్దులకు సేవ చేస్తున్నాం. స్థలం కోసం 2015లో ఆమరణ నిరాహారదీక్ష చేస్తే అప్పటి ఎంపీ వినోద్కుమార్, ప్రస్తుత ఎమ్మెల్యే గంగుల కమలాకర్ లు బొమ్మకల్ శివారులోని 128 సర్వేనంబర్లో స్థలం కేటాయించారు. దాతల సహకారంతో అనాథ వృద్ధాశ్రమ భవనం నిర్మాణం జరుగుతోంది. కానీ.. అనుమతి ఇవ్వలేదు. అనుమతి ఇప్పించడంతో పాటు కలెక్టర్ నిధుల నుంచి నిధులు కేటాయించాలి. – సి.వీరమాధవ్, వీబీ ఫౌండేషన్, కరీంనగర్

విన్నపాలు వినవలె