
యువత మత్తుకు దూరంగా ఉండాలి
కరీంనగర్క్రైం: యువత మత్తు పదార్థలకు దూరంగా ఉండాలని, సన్మార్గంలో పయనించి లక్ష్యాలకు చేరుకోవాలని సీపీ గౌస్ ఆలం సూచించారు. కమిషనరేట్ వ్యాప్తంగా పోలీసులు ఈనెల 26న అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం–అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా 20 నుంచి 26 తేదీ వరకు వివిధ అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా సోమవారం సిరిసిల్ల బైపాస్ రోడ్డులో గల కమిషనరేట్ ట్రైనింగ్ సెంటర్ (సీటీసీ)లో మొక్క నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువత, విద్యార్థులు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీటీసీ వైస్ ప్రిన్సిపాల్ ఏసీపీ వేణుగోపాల్ , సీసీఆర్బీ ఏసీపీ విజయ్ కుమార్, ఇన్స్పెక్టర్లు సంతోష్కుమార్, సరిలాల్, శ్రీనివాస్, తిరుపతి, శ్రీనివాస్లు పాల్గొన్నారు.
● సీపీ గౌస్ ఆలం