
మధ్యాహ్న భోజనం.. నాసిరకం
ఇల్లందకుంట: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుల సంగతి పక్కన పెడితే మధ్యాహ్న కారం, మెతుకులతో కూడిన మధ్యాహ్న భోజనం పెట్టడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. స్థానిక జెడ్పీ హైస్కూల్లో మధ్యాహ్న భోజనం సరిగా పెట్టలేదు. ఎర్రటి కారంతో అన్నం కలుపుకుని తిన్న విద్యార్థులు.. విషయాన్ని తమ తల్లిదండ్రులు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వారు మండిపడుతున్నారు. మధ్యాహ్న భోజనం వండి వడ్డించడంతో విఫలమైన హైస్కూల్ హెడ్మాస్టర్తోపాటు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ విషయంపై తహసీల్దార్ రాణిని సంప్రదించగా.. నాణ్యమైన భోజనం అందించే విషయంలో రాజీపడే ప్రసక్తేలేదన్నారు. నాణ్యత లోపిస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎంఈవో రాములు నాయక్ని వివరణ అడగగా.. కారం, మెతుకుల విషయం తన దృష్టికి రాలేదన్నారు.