
ద్విచక్రవాహనం అదుపుతప్పి యువకుడి మృతి
కరీంనగర్రూరల్: చొప్పదండి మండలం వెదురుగట్టకు చెందిన విష్ణువర్థన్(29) బహుదూర్ఖాన్పేట శివారులో ద్విచక్ర అదుపు తప్పి కింద పడడంతో మృతి చెందాడు. కరీంనగర్రూరల్ సీఐ ఏ.నిరంజన్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. నగునూర్లోని ఓ ఆస్పత్రిలో పనిచేస్తున్న విష్ణువర్ధన్ సోమవారం వెదురుగట్ట నుంచి ప్రతిమ ఆసుపత్రికి వస్తుండగా మార్గ మధ్యలోని బహుదూర్ఖాన్పేట వద్ద ద్విచక్ర వాహనం అదుపు తప్పి సమీపంలోని చెట్టుకు ఢీకొంది. తలకు తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. తండ్రి పర్శరాములు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో ఒకరు..
హుజూరాబాద్: పట్టణానికి చెందిన ఓ న్యూస్ పేపర్ రిపోర్టర్ చిర్ర సుదర్శన్గౌడ్ (55) ఆది వారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. హుస్నాబాద్లో ఓ శుభకార్యానికి హాజ రై తిరిగి వస్తుండగా భీమదేవరపల్లి మండలం గట్ల నర్సింగాపూర్ గ్రామ శివారులో బైక్ అదు పు తప్పడంతో కందకంలో పడి మృతి చెందా డని. మృతుడి కుటుంబానికి తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో రూ.పదివేలు అందజేశారు. మృతుడి కుటుంబ సభ్యులను టీయూడబ్ల్యూజే (ఐజేయూ) జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి గాండ్ల శ్రీనివాస్, చంద్రశేఖర్, హుజూరాబాద్ ప్రెస్క్లబ్ అధ్యక్షుడు కా యిత రాములు, జర్నలిస్టులు పరామర్శించారు.
27న పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక బస్సు
విద్యానగర్(కరీంనగర్): ఆర్టీసీ కరీంనగర్ 1డిపో నుంచి ఈనెల 27న వన్ డే టూర్ ప్యాకేజీ ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ విజయమాధురి తెలిపారు. టూర్ ప్యాకేజీలో చిలుకూరు బాలాజీ, అనంత పద్మనాభ స్వామి, ఏడుపాయల దేవాలయం, అనంతగిరి హిల్స్ను సందర్శించేందుకు సూపర్ లగ్జరీ బస్సును ఏర్పాటు చేశామని అన్నారు. 27న ఉదయం 4గంటలకు కరీంనగర్ నుంచి బయలుదేరి అదే రోజు రాత్రి 9గంటలకు తిరిగి కరీంనగర్కు చేరుకుంటుందని, పెద్దలకు రూ.1.430. పిల్లలకు రూ.900 టికెట్ ఉంటుందని తెలిపారు.
గ్రానైట్ ఫ్యాక్టరీస్ అసోసియేషన్కు సమ్మె నోటీసు
కొత్తపల్లి: జూలై 9న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా శ్రీరాములపల్లి శివారులోని జిల్లా గ్రానైట్ కటింగ్ అండ్ పాలిషింగ్ ఇండస్ట్రీస్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ప్రణీతరావు, భాషకు సోమవారం సీఐటీయూ జిల్లా అధ్యక్ష, కో శాధికారి గీట్ల ముకుందరెడ్డి, జి.రాజేశం పలు డిమా ండ్లతో కూడిన సమ్మె నోటీసు అందజేశారు. నాలు గు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని, అసంఘటిత రంగ కార్మికులు, కాంట్రాక్ట్ కార్మికులందరికీ జాతీయస్థాయిలో కనీస వేతనం నెలకు రూ.26వేలుగా నిర్ణయించాలని, హైకోర్టు ఆర్డర్ ప్రకారం గ్రా నైట్ కార్మికులకు వర్తించే స్టోన్ బ్రేకింగ్ అండ్ స్టోన్ క్రషింగ్ ఆపరేషన్ కనీస వేతనాల జీవో ఎంఎస్ నంబర్ 23 ఫైనల్ విజిట్ ఇవ్వాలని, కాంట్రాక్ట్ కార్మికులకు సమానమైన పనికి సమాన వేతనం అమలు చేయాలని తదితర 20 డిమాండ్లను పరిష్కరించాలని సమ్మె నోటీసు అందించారు.